Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో ఈ నెల 20న రోడ్డెక్కనున్న సిటీ బస్సులు..!

ఏపీలో ఈ నెల 20న రోడ్డెక్కనున్న సిటీ బస్సులు..!
, ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (08:11 IST)
ఏపీలో సిటీ బస్సులను నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తుంది. లాక్ డౌన్ తర్వాత రాష్ట్రంలో మే 20న ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే..అప్పటినుండి జిల్లాల్లో దాదాపు 3వేల బస్సులు ప్రయాణికులను చేరవేస్తున్నాయి. అయితే విజయవాడ,విశాఖపట్నం లో ఇప్ప్పటివరకు సిటీ బస్సులను ప్రారంభించలేదు..
 
కాగా ఈ నెల 20 నుండి 26 వరకు సచివాలయ ఉద్యోగాలకోసం రాతపరీక్షలు ఉన్నాయి. ఈ పరీక్షకు 10 లక్షల మంది హాజరు కానున్నారు. దాంతో పరీక్ష రాసే అభ్యర్థులకోసం రవాణా ఏర్పాటు చేయాల్సి ఉంది..  
 
సచివాలయ ఉద్యోగాల పరీక్షల నేపథ్యంలో హెల్త్‌ ప్రొటోకాల్‌ ప్రకారం సిటీ బస్సు సర్వీసులు నడిపేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అనుమతి కోసం ఫైల్‌ను పంపింది. జవహర్ రెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని నిర్ణయం తీసుకుని అనుమతిస్తారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంతర్వేది కొత్త రథం ఆకృతి సిద్ధం