Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ ఎర్రచందనం డంప్ స్వాధీనం

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (09:16 IST)
వడమాలపేట, పుత్తూరు మార్గ మధ్యలో కల సదాశివ కోన అటవీ ప్రాంతంలో 348 ఎర్రచందనం దుంగలు కలిగిన డంప్ ను ఆర్ ఎస్ ఏ ఎస్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కనుగొన్నారు. రెండు రోజులు పాటు కూంబింగ్ చేపట్టి 348 దుంగలు స్వాధీనం చేసుకున్నారు.
 
 అనంతపురం రేంజ్ డిఐజి క్రాంతి రాణా టాటా  ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ కు అందిన సమాచారంతో ఆర్ ఐ భాస్కర్, సిఐ వెంకట్ రవి ల నేతృత్వంలోని ఆర్ ఎస్ ఐ లు సురేష్, విశ్వనాథ్ ల టీమ్ లు రెండు రోజుల పాటు సదాశివ కోన అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. బుధవారం సాయంత్రానికి భారీ డంప్ ను కనుగొన్నట్లు డీఎస్పీ మురళీధర్ తెలిపారు.
 
ఆయన విలేకరులతో మాట్లాడుతూ ... లాక్ డౌన్ లో ఎర్రచందనం దుంగలు సేకరించి పెట్టుకుని, లాక్ డౌన్ ముగియ గానే తమిళనాడు లాంటి రాష్ట్రాలకు తరలించేందుకు సిద్ధం చేసుకుని ఉండవచ్చునని భావిస్తున్నట్లు తెలిపారు.

ఇంత పెద్ద డంప్ ఇటీవల కాలంలో లభించ లేదని అన్నారు.  డంప్ చేసిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.  డంప్ స్వాధీనం చేసుకున్న సిబ్బందిని డిఐజి అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments