Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిజేరియన్‌ చేస్తూ కత్తెరను మరిచిపోయారు.. బాలింతకు ఏమైందంటే?

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2023 (11:42 IST)
ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఇటీవల సిజేరియన్‌ ద్వారా ప్రసవించిన ఓ గర్భిణి కడుపులోనే కత్తెరను మరిచి వదిలేశారు వైద్యులు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
 
ఒక వారం క్రితం డెలివరీ కోసం గర్భిణీ మహిళ ఆసుపత్రిలో చేరింది. సీనియర్‌ సివిల్‌ సర్జన్‌ నిర్వహించిన సిజేరియన్‌ ఆపరేషన్‌లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ వరకు బాగానే వుంది కానీ ఆపరేషన్ అయ్యాక కుట్లు వేసే క్రమంలో వైద్యులు బాలింత కడుపులోనే కత్తెరను మరిచిపోయారు.  
 
అయితే కడుపులో నొప్పి వేధించడంతో ఆ మహిళ తిరిగి ఆస్పత్రికి చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు స్కానింగ్‌లో ఆమె కడుపులో కత్తెర వుండటాన్ని గమనించారు. 
 
ఆసుపత్రికి చెందిన ఓ ఉద్యోగి తమ ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలలో ఎక్స్-రే ఫోటోను షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఆస్పత్రి అధికారులు వెంటనే స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని ఆస్పత్రి అధికారులు స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments