Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిజేరియన్‌ చేస్తూ కత్తెరను మరిచిపోయారు.. బాలింతకు ఏమైందంటే?

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2023 (11:42 IST)
ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఇటీవల సిజేరియన్‌ ద్వారా ప్రసవించిన ఓ గర్భిణి కడుపులోనే కత్తెరను మరిచి వదిలేశారు వైద్యులు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
 
ఒక వారం క్రితం డెలివరీ కోసం గర్భిణీ మహిళ ఆసుపత్రిలో చేరింది. సీనియర్‌ సివిల్‌ సర్జన్‌ నిర్వహించిన సిజేరియన్‌ ఆపరేషన్‌లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ వరకు బాగానే వుంది కానీ ఆపరేషన్ అయ్యాక కుట్లు వేసే క్రమంలో వైద్యులు బాలింత కడుపులోనే కత్తెరను మరిచిపోయారు.  
 
అయితే కడుపులో నొప్పి వేధించడంతో ఆ మహిళ తిరిగి ఆస్పత్రికి చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు స్కానింగ్‌లో ఆమె కడుపులో కత్తెర వుండటాన్ని గమనించారు. 
 
ఆసుపత్రికి చెందిన ఓ ఉద్యోగి తమ ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలలో ఎక్స్-రే ఫోటోను షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఆస్పత్రి అధికారులు వెంటనే స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని ఆస్పత్రి అధికారులు స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments