Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిజేరియన్‌ చేస్తూ కత్తెరను మరిచిపోయారు.. బాలింతకు ఏమైందంటే?

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2023 (11:42 IST)
ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఇటీవల సిజేరియన్‌ ద్వారా ప్రసవించిన ఓ గర్భిణి కడుపులోనే కత్తెరను మరిచి వదిలేశారు వైద్యులు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
 
ఒక వారం క్రితం డెలివరీ కోసం గర్భిణీ మహిళ ఆసుపత్రిలో చేరింది. సీనియర్‌ సివిల్‌ సర్జన్‌ నిర్వహించిన సిజేరియన్‌ ఆపరేషన్‌లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ వరకు బాగానే వుంది కానీ ఆపరేషన్ అయ్యాక కుట్లు వేసే క్రమంలో వైద్యులు బాలింత కడుపులోనే కత్తెరను మరిచిపోయారు.  
 
అయితే కడుపులో నొప్పి వేధించడంతో ఆ మహిళ తిరిగి ఆస్పత్రికి చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు స్కానింగ్‌లో ఆమె కడుపులో కత్తెర వుండటాన్ని గమనించారు. 
 
ఆసుపత్రికి చెందిన ఓ ఉద్యోగి తమ ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలలో ఎక్స్-రే ఫోటోను షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఆస్పత్రి అధికారులు వెంటనే స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని ఆస్పత్రి అధికారులు స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments