Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపునొప్పి అని ఆస్పత్రికి వెళ్తే.. కత్తెర పెట్టి కుట్టేశారు..

కడుపునొప్పి భరించలేక ఓ రోగి ఆస్పత్రికి వెళ్తే.. అక్కడ పొట్టలో కత్తెర వుందనే విషయం బయటపడింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నెల్

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2017 (15:04 IST)
కడుపునొప్పి భరించలేక ఓ రోగి ఆస్పత్రికి వెళ్తే.. అక్కడ పొట్టలో కత్తెర వుందనే విషయం బయటపడింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు గ్రామీణ మండలం నారాయణరెడ్డిపేటకు చెందిన చలపతి(50) ఈ నెల 2వ తేదీన కడుపునొప్పి భరించలేక జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని వైద్యులను సంప్రదించారు. 
 
వైద్యులు రోగికి శస్త్రచికిత్స చేసి ఇంటికి పంపారు. డిశ్చార్జ్‌ అయినా.. అతనికి కడుపులో ఏమాత్రం నొప్పి తగ్గకపోవడంతో ఈ నెల 27న అదే ఆసుపత్రికి వచ్చి బాధితుడు పరిస్థితి వివరించాడు. ఆపై ఆ వ్యక్తికి నిర్వహించిన పరీక్షల్లో అతని పొట్టలో కత్తెర వున్న విషయాన్ని గుర్తించారు. 
 
ఈ విషయం బయటకు పొక్కనీయకుండా చేయాలనుకున్న ఆస్పత్రి యాజమాన్యానికి ఏమాత్రం వీలుపడలేదు. చివరికి ఈ నెల 28న మళ్ళీ ఆ వ్యక్తికి శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం బాధితుడు కోలుకున్నాడని వైద్యులు తెలిపారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments