Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపునొప్పి అని ఆస్పత్రికి వెళ్తే.. కత్తెర పెట్టి కుట్టేశారు..

కడుపునొప్పి భరించలేక ఓ రోగి ఆస్పత్రికి వెళ్తే.. అక్కడ పొట్టలో కత్తెర వుందనే విషయం బయటపడింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నెల్

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2017 (15:04 IST)
కడుపునొప్పి భరించలేక ఓ రోగి ఆస్పత్రికి వెళ్తే.. అక్కడ పొట్టలో కత్తెర వుందనే విషయం బయటపడింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు గ్రామీణ మండలం నారాయణరెడ్డిపేటకు చెందిన చలపతి(50) ఈ నెల 2వ తేదీన కడుపునొప్పి భరించలేక జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని వైద్యులను సంప్రదించారు. 
 
వైద్యులు రోగికి శస్త్రచికిత్స చేసి ఇంటికి పంపారు. డిశ్చార్జ్‌ అయినా.. అతనికి కడుపులో ఏమాత్రం నొప్పి తగ్గకపోవడంతో ఈ నెల 27న అదే ఆసుపత్రికి వచ్చి బాధితుడు పరిస్థితి వివరించాడు. ఆపై ఆ వ్యక్తికి నిర్వహించిన పరీక్షల్లో అతని పొట్టలో కత్తెర వున్న విషయాన్ని గుర్తించారు. 
 
ఈ విషయం బయటకు పొక్కనీయకుండా చేయాలనుకున్న ఆస్పత్రి యాజమాన్యానికి ఏమాత్రం వీలుపడలేదు. చివరికి ఈ నెల 28న మళ్ళీ ఆ వ్యక్తికి శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం బాధితుడు కోలుకున్నాడని వైద్యులు తెలిపారు. 
 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments