Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేశినేని శ్వేత చేతులు మీదుగా విద్యార్థులకు ఉపకార వేతనాలు

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (18:06 IST)
ఉపకార వేతనాలతో చదువుకున్న విద్యార్థులు భవిష్యత్తులో మరొకరికి సాయం చేయాలని కేశినేని శ్వేత అన్నారు. భారత మహిళా మండలి చైర్మన్ అరుణ బోస్ అధ్యక్షతన మహిళా మండలి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విజయవాడకు చెందిన 15 మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలను, 10 మంది పేదవారికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1,75000/-లను కేశినేని శ్వేత గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.
 
ఈ సందర్భంగా కేశినేని శ్వేత మాట్లాడుతూ... విద్య ద్వారానే పేదరికాన్ని అధిగమించి ఉన్నతస్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులు, సంస్థలు విద్యార్థులకు సాయం అందించేందుకు ముందుకు రావాలని కోరారు.
 
కులమతాలకు అతీతంగా పేద విద్యార్థులకు సాయం చేయాలన్న లక్ష్యం, పేదలకు వైద్య ఖర్చులు ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలి మాజీ చైర్మన్ అన్నపూర్ణ గారు, విజయశ్రీ గుప్తా గారు, అష్టాలక్ష్మి గారు, సాయి లక్ష్మీ గారు, పద్మజ గారు, సువర్ణ గారు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

Raviteja: రవితేజ మాస్ జాతర విడుదల ఆలస్యమవుతుందా?

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments