18 లక్షల మంది విద్యార్థులకు నెలకు రూ.1200 ఉపకార వేతనాలు

అమరావతి: రాష్ట్రంలో చంద్రన్న బీమా పధకానికి సంబంధించిన క్లెయిమ్‌లు అన్నిటినీ నిర్దేశిత సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్(ఎస్ఎల్ఏ) గడువు ప్రకారం సకాలంలో పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ భారత జీవిత భీమా(ఎల్ఐసి

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (17:50 IST)
అమరావతి: రాష్ట్రంలో చంద్రన్న బీమా పధకానికి సంబంధించిన క్లెయిమ్‌లు అన్నిటినీ నిర్దేశిత సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్(ఎస్ఎల్ఏ) గడువు ప్రకారం సకాలంలో పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ భారత జీవిత భీమా(ఎల్ఐసి), ఓరియంటల్ ఇన్సూరెన్స్(ఓఐసి)సంస్థలకు సూచించారు. ఈ మేరకు సోమవారం వెలగపూడి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో చంద్రన్న బీమా పధకంపై సంబంధిత శాఖల అధికారులు,ఆయా బీమా సంస్థలతో సమీక్షించారు. 
 
ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ చంద్రన్న బీమా పధకానికి సంబంధించిన కేసులను ఆయా శాఖలు సకాలంలో నమోదు చేసి డాక్యుమెంటేషన్ ప్రక్రియను పూర్తి చేసి ఎల్ఐసి, ఓఐసి బీమా సంస్థలకు పంపించి నిర్దేసిత ఎస్ఎల్ఏ ప్రకారం పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందుకుగాను సంబంధిత శాఖలు, బీమా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సిఎస్ స్పష్టం చేశారు. వచ్చిన క్లెయిమ్‌లను అర్హమైనవా కాదా అనేది మానిటరింగ్ కమిటీ సమావేశం పూర్తిగా పరిశీలించి వాటి అర్హతపై ఒకేసారి నిర్ణయం తీసుకోవాలని అంతేగాని అనవసరంగా ఒకసారి తిరస్కరించి మరోసారి వాటిని పరిశీలించడం వంటి చర్యలకు స్వస్తి పలకాలని ఆయన స్పష్టం చేశారు.
 
అక్టోబరు 2వతేదీన చంద్రన్న బీమా పధకంలో నమోదైన కుటుంబాల విద్యార్ధులకు ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర,జిల్లా స్థాయిల్లో శ్రీకారం చుట్టడం జరుగుతుందని ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే 18లక్షల మంది విద్యార్ధులకు నెలకు 1200రూ.లు వంతున ఉపకార వేతనాలు పంపణీకై ఎల్ఐసికి క్లెయిమ్‌లు పంపగా ఇప్పటికే 2లక్షల 38వేల మంది విద్యార్ధులకు ఉపకార వేతనాలను మంజూరు చేసిందని తెలిపారు. అక్టోబరు నెలాఖరులోగా 18లక్షల మంది విద్యార్ధులకు ప్రత్యక్ష నగదు బదిలీ(డిబిటి)కింద ఈఉపకార వేతనాలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.అక్టోబరు 31వతేదీన చంద్రన్న బీమాపై తదుపరి సమీక్ష నిర్వహించడం జరుగుతుందని అప్పటిలోగా పెండింగ్ లో ఉన్న క్లెయిమ్ లు అన్నీ పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ దినేష్ కుమార్ సూచించారు.
 
కార్మిక,ఉపాధి కల్పన మరియు శిక్షణశాక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ చంద్రన్న బీమా పధకం అమలుకు జాతీయ స్థాయిలో ఎల్ఎసి నోడలు ఏజెన్సీగా ఉందని అన్నారు.ఈపధకం అమలుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేలా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. కార్మిక,ఉపాధి కల్పన శాఖ కమీషనర్ డి.వరప్రసాద్ సమావేశ అజెండాను వివరిస్తూ ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీకి చంద్రన్న బీమాకు సంబంధించి ఇప్పటి వరకూ 8వేల 675 క్లెయిమ్‌లు రాగా మరో 772 ప్రగతిలో ఉండగా 7వేల 48 మంజూరు కోసం అప్‌లోడ్ చేయగా మరో 421 ప్రగతిలో ఉన్నాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments