Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుటుంబం ఉసురు తీసిన ఆర్థిక క‌ష్టాలు.. ఆరుగురి ఆత్మ‌హ‌త్య‌

ఆర్థిక కష్టాలు ఓ కుటుంబం ఉసురు తీసింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో ఈ విషాదం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే..

Advertiesment
Suicide
, సోమవారం, 18 సెప్టెంబరు 2017 (09:01 IST)
ఆర్థిక కష్టాలు ఓ కుటుంబం ఉసురు తీసింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో ఈ విషాదం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
సూర్యాపేట ప‌ట్ట‌ణంలోని స్థానిక క‌స్తూరీ బ‌జార్‌లో నివ‌సించే క‌స్తూరి జనార్దన్ (59) అనే వ్యక్తి కుటుంబం గ‌త కొంత‌కాలంగా ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో కొట్టుమిట్టాడుతోంది. క‌ష్టాలు తీరే మార్గం క‌నుచూపు మేర‌లో క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని నిర్ణయించాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా చెప్పాడు. వారు కూడా ఆయనతో పాటు బలవన్మరణానికి పాల్పడేందుకు సమ్మతించారు. దీంతో కుటుంబంలోని ఆరుగురు క‌లిసి పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. 
 
స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మృతుల‌ను జ‌నార్ద‌న్‌, చంద్ర‌క‌ళ (50), ప్ర‌భాత (30), అశోక్ (25), సిరి (5), రుత్విక (2)లుగా గుర్తించారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. నిన్న‌టివ‌ర‌కు త‌మ మ‌ధ్య ఉన్న వారు తెల్లారేస‌రికి విగ‌త జీవులుగా మార‌డం చూసి ప‌ట్ట‌ణ‌వాసులు క‌న్నీటి పర్యంత‌మ‌వుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినీ ఆర్టిస్టుపై అసభ్యంగా ప్రవర్తించాడు.. భర్త అప్పు తీసుకున్నాడని?