Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (08:46 IST)
ప్రస్తుతం ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం నెలకొనివుంది. స్థానిక సంస్థలు, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మార్చి 13వ తేదీ జరుగనుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నగరా మోగింది. 
 
ప్రస్తుతం ఏపీలో ఏడుగురు ఎమ్మెల్సీలు, తెలంగాణాలో ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. వీరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో పాటు టీడీపీ ఎమ్మెల్సీ బచ్చు అర్జునుడు, వైకాపా నేతలు పోతుల సునీత, గంగుల ప్రభాకర్ రెడ్డి, దివంగత చల్లా భగీరథ రెడ్డి, పెన్మత్స సూర్యనారాయణ, డొక్కా మాణిక్య వరప్రసాద్‌లు ఉన్నారు. వీరంతా ఎమ్మెల్యే కోటాలో ఎన్నికయ్యారు.
 
అలాగే, తెలంగాణ రాష్ట్రంలో ఎలిమినేటి కృష్ణారెడ్డి, నవీన్ రావు, గంగాధర్ రావుల పదవీ కాలం కూడా త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను జారీ చేసింది. మార్చి 6న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మార్చి 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 14న నామినేషన్లు పరిశీలిస్తారు. మార్చి 23న పోలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తారు. అదే రోజున ఓట్ల లెక్కింపు ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments