Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి డాలర్లు కావాలా? అవి లేవండీ...

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (19:35 IST)
తిరుమల శ్రీవారి డాలర్‌కు ఎంతో డిమాండ్ ఉంది. స్వామివారి డాలర్‌ను చాలామంది మెడలో ధరిస్తూ ఉంటారు. స్వామివారి ప్రతిమతో ఉన్న డాలర్‌ను ధరిస్తే ఎంతో మంచిదన్నది భక్తుల నమ్మకం. అందుకే శ్రీవారి డాలర్‌ను తిరుమలలో టిటిడినే విక్రయిస్తోంది. అయితే ప్రస్తుతం శ్రీవారి డాలర్లు భక్తులకు అందుబాటులో లేకుండా పోయాయి.
 
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్సించుకున్న భక్తులు యాత్రకు గుర్తుగా శ్రీవారి చిత్రాలతో రూపొందించిన బంగారు, వెండి, రాగి డాలర్లను కొనుగోలు చేస్తుంటారు. ప్రధాన ఆలయానికి ఎదురుగా టిటిడి వీటి విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
 
కొంతకాలంగా ఈ కేంద్రంలో తక్కువ బరువుతో వున్న బంగారు, వెండి డాలర్లు అందుబాటులో లేవు. కేవలం పదిగ్రాముల బంగారు, రాగి డాలర్లు మాత్రమే అమ్ముతున్నారు. 5, 2 గ్రాముల బంగారు డాలర్లు 50, 10, 5 గ్రాముల వెండి డాలర్లు నిండుకున్నాయి. 
 
కొనుగోలు కేంద్రానికి వచ్చిన భక్తులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఈ నెలలో బ్రహ్మత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో టిటిడి డాలర్లు అందుబాటులోకి తీసుకురావాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments