Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేత చింతమనేనిపై ఎస్సీఎస్టీ వేధింపుల కేసు

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (09:58 IST)
టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదైంది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం, ప్రగడవరం పంచాయతీ పరిధిలోని అంకంపాలెంలో సోమవారం రాత్రి టీడీపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెంచిన అనేక చార్జీలను ఎత్తి చూపుతూ, "బాదుడే బాదుడు" కార్యక్రమం నిర్వహించింది. 
 
ఇందులో పాల్గొన్న చింతమనేని ప్రభాకర్ ఏపీలోని వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. తమ గ్రామంలో తమ పార్టీ అధినేతను టీడీపీ నేతలు విమర్శించడాన్ని సహించలేని వైకాపా నేతలు టీడీపీ నేతలపై దౌర్జన్యానికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీనిపై గ్రామ సర్పంచ్ తొమ్మండ్రు భూపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు చింతమనేని ప్రభాకర్‍‌పై ఎస్సీఎస్టీ కేసు నమోదు చేశారు. 
 
మరోవైపు, టీడీపీ నేతలు కూడా వైకాపా నేతలపై ఫిర్యాదులు చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై సర్పంచ్ భూపతి, ఉప సర్పంచ్ రమేష్ రెడ్డి, మరో ఐదుగురు దాడి చేశారని, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని టీడీపీ నేత రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో వైకాపా నేతలపై కూడా పోలీసులు ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments