Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబటి రాంబాబు... మైనింగ్ రాయుడు : షాకిచ్చిన వైసీపీ కార్యకర్తలు

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (08:01 IST)
ఏపీలోని అధికార వైకాపా అధికార పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై ఆ పార్టీకి చెందిన కార్యకర్తలే సంచలన ఆరోపణలు చేశారు. అంబటి రాంబాబు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారంటూ వారు ఏకంగా హైకోర్టునే ఆశ్రయించారు. ఇది సంచలనంగా మారింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అంబటి రాంబాబు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారంటూ రాజుపాలెం వైసీపీ కార్యకర్తలు ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం కోట నెమిలిపురి, కొండమోడులో అక్రమ మైనింగ్ జరిగిందని పిల్‌లో ఆరోపించారు. 
 
ఈ విషయంపై సీఎం జగన్‌, జిల్లా కలెక్టర్‌, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పిటిషన్లు పంపినా పట్టించుకోలేదని వారు పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై ఇప్పటికే స్థానిక మైనింగ్‌ అధికారులు విచారణ జరిపారని కూడా పిటిషన్‌లో వీరు పేర్కొన్నారు.
 
ఈ పిటిషన్‌ను వైకాపా కార్యకర్తల తరపున హైకోర్టు న్యాయవాది నాగరఘు దాఖలు చేశారు. వాదనలు విన్న హైకోర్టు... అధికారిక పార్టీకి చెందిన వారే పిటిషన్ వేస్తే... అది ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎలా అవుతుందని ప్రశ్నించింది. అక్రమ మైనింగ్‌పై వెంటనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments