Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆషాడ మాసం సారెలోని చీరను చోరీ చేసిన సూర్యలత... వేటు వేసిన సర్కారు

అమ్మవారి వస్తువులను పరిరక్షించాల్సిన పాలకమండలి సభ్యురాలే దొంగగా మారిపోయింది. అమ్మవారి చీరను దొంగిలించారు. ఆమె ఎవరో కాదు.. సూర్యలత. దీంతో ఆమెపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్య తీసుకున్నారు. దుర్గ

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (09:54 IST)
అమ్మవారి వస్తువులను పరిరక్షించాల్సిన పాలకమండలి సభ్యురాలే దొంగగా మారిపోయింది. అమ్మవారి చీరను దొంగిలించారు. ఆమె ఎవరో కాదు.. సూర్యలత. దీంతో ఆమెపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్య తీసుకున్నారు. దుర్గగుడి పాలక మండలి సభ్యురాలు పదవి నుంచి ఆమెను తొలగించారు.
 
ఈనెల 5న భక్తబృందం అమ్మవారికి తెచ్చిన ఆషాడ మాసం సారెలో ఖరీదైన చీర మాయం అయింది. పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత కుమారిపై ఆరోపిస్తూ భక్త బృందం లిఖితపూర్వకంగా పాలకమండలి ఛైర్మెన్ గౌరంగబాబుకు ఫిర్యాదు చేశారు. విషయం పెద్దది కావడం, మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఆలయ అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. 
 
ముఖ్యమంత్రి ఆదేశాలతో దుర్గగుడి ఈవో, ఇన్‌చార్జ్ కమిషనర్ పద్మ సమగ్ర నివేదిక చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఆలయ ప్రధానార్చకులు, సిబ్బందిని విచారించిన అనంతరం పాలకమండలి సభ్యురాలు సూర్యలత కుమారి చీరను తీసుకెళ్లినట్లు నిర్ధారణ కావడంతో ట్రస్ట్ బోర్డు నుంచి ఆమెను తొలగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఉత్తర్వులు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments