Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపట్ల వద్ద సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెనుముప్పు...

Webdunia
గురువారం, 22 జూన్ 2023 (20:09 IST)
ఏపీలోని బాపట్ల జిల్లా వద్ద దానాపూర్ - బెంగూళురు ప్రాంతాల మధ్య నడిచే సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ముప్పు తప్పింది. చీరాల మండలం ఈపురుపాలెం వంతెన వద్ద రైలు పట్టా విరిగింది. దీన్ని ఓ చేనేత కార్మికుడు గుర్తించి రైల్వే అధికారులకు చేరవేయడంతో ఈ ముప్పు తప్పింది. లేనిపక్షంలో పెను ప్రమాదం జరిగివుండేది. దీంతో అదే ట్రాక్‌పై రైలును నిలిపివేశారు. 
 
ఈ ప్రమాదాన్ని గద్దె బాబు అనే చేనేత కార్మికుడు ముందుగా గుర్తించి సకాలంలో రైల్వే స్టేషన్ సిబ్బందికి చేరవేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలుసిన ప్రయాణికులు పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విరిగిన పట్టాను సరిచేసిన తర్వాత సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలు బెంగుళూరుకు బయలుదేరి వెళ్లింది. ఈ పట్టాకు మరమ్మతులు చేసేంత వరకు ఐదు రైళ్లను నిలిపివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments