పరమ శివుని తాకిన గంగమ్మ

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (10:32 IST)
ఏటా కార్తీక మాసంలో ఈ అద్భుతం  జరుగుతుంది. సంగమేశ్వరంలో సంగమేశ్వర ఆలయంలో ఈ సన్నివేశాన్ని కళ్ళారా చూడొచ్చు. ఏటా కార్తీక మాసంలో గంగమ్మ పరమేశ్వరుని తాకుతుంది. నెల్లూరు జిల్లాలోని మనుబోలు మండలం బద్వేలు క్రాస్ రోడ్డులో సంగమేశ్వర ఆలయంలో ఈ విశేషం చోటు చేసుకొంది.


సంగమేశ్వర ఆలయాన్ని మూడు ఏరులైన పిల్లేరు, వడ్డేరు, కల్లేరు సంగమ స్థానంలో పరశురాముడు ప్రతిష్టించాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శివుని వరం కారణంగా గంగమ్మ  ప్రతి కార్తీకమాసం  మూడు రోజుల పాటు శివుని తాకి తన్మయత్వoతో పరవశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. 
ఈ ఆలయంలో నీరు భూమి నుంచి ఊటలాగా పైకి  ఊరుతుందని స్థానికులు తెలియజేస్తున్నారు.


ఏ శివాలయంలో జరగని విధంగా ఇక్కడ ఈ దృశ్యం చోటు చేసుకొంటుంది. ప్రతి ఏటా ఇలానే ఇక్కడ జరుగుతుంది. ఆలయ అర్చకులు ఆ నీటిలోనే శివునికి పూజలు చేస్తారు. ఇక్కడికి వచ్చి, స్వామి వారిని ఏమి కోరుకొన్నా  జరుగుతుందని, ఏల్నాటి శని సైతం ఈ ఆలయంలో శివుని దర్శనంతో ఉపసమనం కలుగుతుందని భక్తుల అంచలంచల నమ్మకం. ఈ విశేషాన్ని కనులారా చూసేందుకు భక్తులు రామేశ్వరానికి వస్తున్నారు. కార్తీక మాసం పుణ్యతిధి అని, ఈ సమయంలో స్వామి వారి దర్శనం మహాభాగ్యమని భక్తులు పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments