Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఠాపురంలో పోలీసుల “సంప్రదాయ సంక్రాంతి” క్రీడా సంబరాలు

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (16:01 IST)
తూర్పు గోదావ‌రి జిల్లా పిఠాపురంలో “సంప్రదాయ సంక్రాంతి” క్రీడా పోటీలను స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో కలిసి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలకు స్థానిక యువతీ, యువకులు, మ‌హిళల నుండి విశేష స్పందన ల‌భిస్తోంది. యువతకు కబడ్డీ, వాలీబాల్, షటిల్ పోటీలు, మహిళలకు రంగవల్లి పోటీలు ఏర్పాటు చేశారు.
 
 
జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అన్ని సబ్ డివిజన్లలో “సంప్రదాయ సంక్రాంతి” క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలలో నిర్వహించే కోడి పందాలు, గుండాట, పేకాట వంటి జూదక్రీడలు చట్ట వ్యతిరేకమని, గ్రామాలలో ప్రజలు, యువత ఈ విషయాన్ని గమనించి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. అందుకే సంక్రాంతి పండుగను సంప్రదాయ బద్దంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో సాంస్కృతిక ఆట పాటలతో, సంప్రదాయ క్రీడలతో జరుపుకోవాలని పిలుపినిచ్చారు. ఎవరైనా కోడి పందాలు, గుండాట, పేకాట వంటి జూదక్రీడలలో పాల్గొంటే చట్టపరమైన చర్యలుంటాయ‌ని చెప్పారు. 
 
 
పోలీసు శాఖ నిర్వహిస్తున్న ఈ క్రీడాపోటీల ప్రారంభోత్సవానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబుకి ఎస్పీ కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కుమార్, కాకినాడ పట్టణ డిఎస్పీ భీమారావు, పిఠాపురం సర్కిల్ పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments