Webdunia - Bharat's app for daily news and videos

Install App

సజ్జల రామకృష్ణారెడ్డి భూదందా నిజమే.. నిగ్గు తేల్చిన నిజ నిర్ధారణ కమిటీ

ఠాగూర్
మంగళవారం, 6 మే 2025 (11:44 IST)
గత వైకాపా ప్రభుత్వంలో సకల శాఖామంత్రిగా గుర్తింపు పొందిన ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి భూకబ్జాలకు పాల్పడినట్టు ప్రభుత్వం నియమించిన నిజ నిర్ధారణ కమిటీ తేల్చింది. వైఎస్ఆర్ జిల్లా సీకే దిన్నెలో సజ్జల కుటుంబం భూ ఆక్రమణలకు పాల్పడినట్టు తేలింది. మొత్తం 63.72 ఎకరాల కబ్జా చేసినట్టు విచారణ కమిటి నిర్ధారించింది. ఆక్రమించుకున్న భూముల్లో 52.40 ఎకరాల అటవీ భూమి, పాయవంక రిజర్వాయర్ భూమి ఉన్నాయని, ఆక్రమి భూముల్లో పక్కా నిర్మాణాలు, ప్రభుత్వ రాయితీలను ఉపయోగించుకున్నారని, భూమి స్వాధీనానికి, కఠిన చర్యలు తీసుకునేలా కమిటి సిఫారసు చేసింది. 
 
సజ్జల కుటుంబం ఆక్రమించుకున్న భూమిలో సింహభాగం అటవీ శాఖకే చెందినదిగా గుర్తించింది. సీకే దిన్నె గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 1629లో ఏకంగా 52.40 ఎకరాల అటవీ భూమిని ఎనిమిది వేర్వేరు ప్రాంతాల్లో ఆక్రమించుకున్నట్టు గుర్తించింది. దీంతో పాటు గతంలో పాయవంక రిజర్వాయర్ నిర్మాణం కోసం ప్రభుత్వం సేకరించిన 8.05 ఎకరాల భూమి, మరికొంత అసైన్డ్ భూమి కూడా ఈ ఆక్రమణలో ఉన్నట్టు తేలింది. ఈ భూములు చుట్టూ కంచె వేయడమే కాకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా ఒక అతిథి గృహం, నాలుగు గదులు నిర్మించారని కమిటీ తన నివేదికలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments