Webdunia - Bharat's app for daily news and videos

Install App

సజ్జల రామకృష్ణారెడ్డి భూదందా నిజమే.. నిగ్గు తేల్చిన నిజ నిర్ధారణ కమిటీ

ఠాగూర్
మంగళవారం, 6 మే 2025 (11:44 IST)
గత వైకాపా ప్రభుత్వంలో సకల శాఖామంత్రిగా గుర్తింపు పొందిన ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి భూకబ్జాలకు పాల్పడినట్టు ప్రభుత్వం నియమించిన నిజ నిర్ధారణ కమిటీ తేల్చింది. వైఎస్ఆర్ జిల్లా సీకే దిన్నెలో సజ్జల కుటుంబం భూ ఆక్రమణలకు పాల్పడినట్టు తేలింది. మొత్తం 63.72 ఎకరాల కబ్జా చేసినట్టు విచారణ కమిటి నిర్ధారించింది. ఆక్రమించుకున్న భూముల్లో 52.40 ఎకరాల అటవీ భూమి, పాయవంక రిజర్వాయర్ భూమి ఉన్నాయని, ఆక్రమి భూముల్లో పక్కా నిర్మాణాలు, ప్రభుత్వ రాయితీలను ఉపయోగించుకున్నారని, భూమి స్వాధీనానికి, కఠిన చర్యలు తీసుకునేలా కమిటి సిఫారసు చేసింది. 
 
సజ్జల కుటుంబం ఆక్రమించుకున్న భూమిలో సింహభాగం అటవీ శాఖకే చెందినదిగా గుర్తించింది. సీకే దిన్నె గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 1629లో ఏకంగా 52.40 ఎకరాల అటవీ భూమిని ఎనిమిది వేర్వేరు ప్రాంతాల్లో ఆక్రమించుకున్నట్టు గుర్తించింది. దీంతో పాటు గతంలో పాయవంక రిజర్వాయర్ నిర్మాణం కోసం ప్రభుత్వం సేకరించిన 8.05 ఎకరాల భూమి, మరికొంత అసైన్డ్ భూమి కూడా ఈ ఆక్రమణలో ఉన్నట్టు తేలింది. ఈ భూములు చుట్టూ కంచె వేయడమే కాకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా ఒక అతిథి గృహం, నాలుగు గదులు నిర్మించారని కమిటీ తన నివేదికలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments