Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సజ్జల రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం వుంది: ఏపీ డిజిపి

sajjala ramakrishna reddy

ఐవీఆర్

, మంగళవారం, 15 అక్టోబరు 2024 (16:14 IST)
వైసిపి హయాంలో పనిచేసిన పలువురు నేతలను పోలీసు కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పలువురుని అరెస్టు చేసారు. తాజాగా వైసిపి ప్రభుత్వ హయాంలో సలహాదారుగా పనిచేసిన మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఢిల్లీ విమానాశ్రయంలో అడ్డగించారు.

ఆయనపై లుకవుట్ నోటీసులు వుండటంతో ఇమ్మిగ్రేషన్ అధికారులను సజ్జలను అడ్డుకున్నారు. దీనిపై ఏపీ డిజిపి ద్వారకా తిరుమలరావు స్పందిస్తూ... సజ్జలపై గతంలో గుంటూరు ఎస్పీ లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం వున్నదని వివరించారు.
 
లుకౌట్ నోటీసులపై తనకు ఎలాంటి సమాచారం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఐనా తను విదేశాల నుంచి సోమవారం నాడు తిరిగి వచ్చాననీ, ఇప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లబోతుంటే అడ్డగించారంటూ చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో మద్యం షాపులకు లాటరీ: లక్కీగా 10 మద్యం షాపులు దక్కించుకున్న మాజీ ఎంపి కుమార్తె