Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు ఇవ్వాలి:కెవిపిఎస్

Webdunia
మంగళవారం, 5 మే 2020 (21:26 IST)
లాక్ డౌన్ నేపథ్యంలో ప్రతి కుటుంబానికి జీవనభృతి కోసం 7500 రూపాయలు ఇవ్వాలని కేరళ తరహా 17 నిత్యవసర వస్తువులను ఉచితంగా పేదలకు పంపిణీ చేయాలని కెవిపిఎస్ రాష్ట్ర నాయకులు ఎం రవి డిమాండ్ చేశారు.

మంగళవారం నాడు రాజధాని గ్రామమైన వెంకటపాలెం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహల ఎదుట కెవిపిఎస్ రాజధాని డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమం నుద్దేశించి రవి మాట్లాడుతూ.. గోడౌన్లలో నిల్వ ఉన్న బియ్యం గోధుమలు తదితర  నిత్యవసర వస్తువులను పేదలకు పంపిణీ చేయాలని కోరారు. రాజధానిలో కూలీలు పేదలకు ఉపాధి చూపించాలని అన్నారు.

అసైన్డ్  భూమి సాగుదారులు అయిన పేదలకు వెంటనే కౌలు చెక్కులు ఇవ్వాలని కోరారు మద్యం వలన పేద కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించకపోవడం వలన కరోనా పాజిటివ్ కేసులు పెరిగే ప్రమాదం ఉందని తక్షణం మధ్యాన్ని నిలిపివేయాలని రవి డిమాండ్ చేశారు.

కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర వ్యాపిత పిలుపులో భాగంగా వెంకటపాలెంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాజధాని డివిజన్ నాయకులు జి. కృష్ణ, కె ఆంజనేయులు ఎం. నాగరాజు,  కృష్ణారావు  తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments