Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ బడిలో చేరితే నెలకు రూ.500 నగదు - ఓ గ్రామ సర్పంచ్ ఆఫర్

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (13:48 IST)
దేశంలో ప్రభుత్వ బడులు నిర్వీర్యమైపోతున్నాయి. దీనికి కారణం ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపించడం లేదు. ఈ కారణంగా గవర్నమెంట్ స్కూల్స్‌కు ఆదరణ క్రమంగా తగ్గిపోతోంది. అయితే, ఓ గ్రామ సర్పంచ్ మాత్రం ఈ స్కూల్స్‌కు తిరిగి పూర్వవైభవం తెచ్చేందుకు తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులోభాగంగా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. 
 
ప్రభుత్వ బడిలో చేరే చిన్నారులకు రూ.500 నగదు ప్రోత్సాహక బహుమతితో పాటు పుస్తకాలు, యూనిఫాం ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చారు. ఈ నగదు ప్రోత్సాహక బహుమతిని ప్రతి నెలా అందించనున్నట్టు ప్రకటించడం గమనార్హం. ఇంతకీ ఈ తరహా నిర్ణయం తీసుంది ఓ మహిళా సర్పంచ్. ఆమె పేరు కొడగూటి శారద. తెలంగాణా రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం, శాలపల్లి - ఇందిరా నగర్ సర్పంచ్. 
 
ఈ రెండు గ్రామాల్లో రెండు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 70 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. ఈ యేడాది బడిబాట కార్యక్రమం ద్వారా మరో 50 మంది చిన్నారులను బడిలో చేర్పించేందుకు ఆమె కంకణం కట్టుకున్నారు. 
 
ఇందుకోసం ఈ రెండు గ్రామాల్లో ఉన్న చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే నెలకు రూ.500 చొప్పున ప్రోత్సాహక బహుమతి ఇస్తామని, స్కూల్స్ యూనిఫామ్స్, పుస్తకాలను కూడా ఉచితంగానే అందిస్తామని ఆనె ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments