Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎంపీలో పానీపూరి ఆరగించి 97 మంది చిన్నారులకు అస్వస్థత

fire panipuri
, ఆదివారం, 29 మే 2022 (17:00 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పానీపూరి ఆరగించి 97మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ పానీపూరీలు ఆరగించిన తర్వాత తీవ్రమైన కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్నారు. దీంతో వీరందరినీ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
రాష్ట్రంలోని సింగర్ పూర్ జాతరలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతం జిల్లా కేంద్రానికి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిపై జిల్లా ఎస్పీ స్పందిస్తూ, ఈ జాతరకు వచ్చిన చిన్నారులు కొంతమంది చిరుతిండిగా పానీపూరీ ఆరగించారని వారంతా రాత్రి 7.30 గంటల సమయంలో వాంతులు విరేచనాలు చేసుకోవడంతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారని తెలిపారు. ఫుడ్ పాయిజినింగ్ కారణంగానే ఇది జరిగిందని వారిని పరీక్షించిన వైద్యులు వెల్లడించారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళను తాకిన రుతుపవనాలు