Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్విమ్స్ మృతురాలు రాధికా కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం: మంత్రి ఆళ్ల నాని

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (20:08 IST)
తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ లోని కోవిడ్ సెంటర్ బిల్డింగ్ పెచ్చులు ఊడిపడి రాధికా అనే అటెండర్ అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రాధికా కుటుంబానికి రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియాను ఇస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు.
 
గాయపడిన వారికి రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నట్లు తెలిపారు. రాధికా మరణం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాధికా భర్త కూడా స్విమ్స్ లోనే 10 ఏళ్లకు పైగా పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం వీరి ఇద్దరి కుమారులు వారం వ్యవధిలో తీవ్రమైన జ్వరంతో చనిపోయారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంతో మినిగిపోయింది.
 
ఇప్పుడు ఆమె మళ్లీ గర్భం దాల్చడంతో ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ప్రమాదవశాత్తు చనిపోవడం బాధాకరం. ఆమె భర్త హరి పరిస్థితి దారుణంగా ఉంది. సర్వస్వాన్ని కోల్పోయానంటూ ఆయన రోదిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments