Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సర్కారుపై ఆర్ఆర్ఆర్ ఫైర్.. సాక్షుల్ని కాపాడండి..

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (12:42 IST)
ఏపీ సర్కారుపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అడ్డదారుల్లో రుణాలు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.8 వేల కోట్ల లిక్కర్ బాండ్స్‌ను విడుదల చేసినట్లు చెప్పారు. 
 
మార్జిన్ పేరుతో బెవరేజ్‌ కార్పొరేషన్‌కు ఆదాయాన్ని చూపించారన్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, లిక్కరుపై ఎలాంటి ఆదాయం వచ్చినా ప్రభుత్వ ఖజానాకే చేరాలని స్పష్టం చేశారు. ఈ ఆదాయంపై బ్యాంకుల వద్ద ఏపీ ప్రభుత్వం రూ.8 వేల కోట్ల రుణాలు తీసుకున్నట్లు చెప్పారు.  
 
మరోవైపు మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షి గంగాధర్ రెడ్డి మృతిపై రఘురామ స్పందించారు. సాక్షి గంగాధర్ రెడ్డి మరణంపై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. ఇప్పటివరకూ ముగ్గురు సాక్షులు చనిపోయారని.. ఉన్న సాక్షులనైనా కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. 
 
జూలై 4న ప్రధాని మోదీ పర్యటన ఉందని, ఆ సందర్భంగా తన నియోజకవర్గానికి వెళ్లాలని అనుకుంటున్నట్లు రఘురామ పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కోసం ప్రధాని వస్తున్నారన్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments