Webdunia - Bharat's app for daily news and videos

Install App

తినింది అరగక కొందరు కూర్చుని ఏదో మాట్లాడుతుంటారు: రోజా ఆగ్రహం

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (15:18 IST)
ఎవరు పేరు చెబితే ప్రతిపక్షాలకు నిద్ర లేకుండా పోతుందో ఆమే రోజా. ఇదేదో సినిమా డైలాగ్ లాగానే ఉన్నా రియల్ ఫాక్ట్. ఫైర్ బ్రాండ్ రోజా మళ్ళీ కదనరంగంలోకి దిగారు. తన వ్యక్తిగత గన్‌మెన్‌కు కరోనా సోకడంతో ఆమె ఇంటి వద్దే ఐసోలేషన్లో ఉన్న విషయం తెలిసిందే.
 
సుమారుగా 10 రోజుల పాటు ఇంటికే పరిమితమైన రోజా మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చారు. ముఖ్యమంత్రి ఆర్థిక సహాయ నిధి కింది కరోనా సమయంలో 24 మంది నిరుపేదలకు 12 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు రోజా.
 
ప్రతిపక్షపార్టీ నేతలపై పదునైన విమర్సలను సంధించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా కరోనా టెస్టులు ఎపిలో చేస్తుంటే చంద్రబాబునాయుడు హైదరాబాదులోని తన నివాసంలో కూర్చుని ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. 
 
ట్విట్టర్ బాబు నారా లోకేష్ సిఎంపై విమర్సలు చేసే ముందు తన అర్హత ఏంటో తెలుసుకోవాలన్నారు. కుల, మతాలు, ప్రాంతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి నిరుపేదలకు సేవ చేస్తున్నారని రోజా చెప్పారు. హోం ఐసోలేషన్ నుంచి తిరిగి రోజా జనంలోకి రావడంతో నగరి ప్రజలు పెద్ద ఎత్తున ఆమెను చూసేందుకు ఇంటి వద్దకు చేరుకున్నారు. 
 
సామాజిక దూరాన్ని పాటిస్తూ అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ రోజా అభివాదం చేశారు. నగరి నియోజకవర్గంలో నిరంతరాయంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని రోజా ప్రజలకు హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments