Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయలసీమ ప్రజలను హెచ్చరించిన రోజా.. డిసెంబర్ 2వ తేదీ..?

Webdunia
శనివారం, 28 నవంబరు 2020 (23:11 IST)
దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నివార్ తుఫాన్ బాధితులను జగన్మోహన్ రెడ్డి ఆదుకుంటున్నారన్నారు ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా. తిరుపతి విమానాశ్రయంలో రోజా మీడియాతో మాట్లాడుతూ నివార్ తుఫాన్ లో 33శాతం డ్యామేజ్ అయిన రైతులకు విత్తనాలపై 80శాతం సబ్సిడీ కింద అందించమని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు రోజా చెప్పారు.
 
బాధితులను ఆదుకోవడం.. పునరావాస కేంద్రాలకు తరలించడంలో అధికారులు శాయశక్తులా కృషి చేశారని.. వారిని కూడా ముఖ్యమంత్రి అభినందించినట్లు చెప్పారు. డిసెంబర్ 30వ తేదీ లోగా వరద బాధితుల అకౌంట్లలోకే నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందజేస్తుందన్నారు.  చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో విపత్తులు వచ్చాయని.. కానీ అలాంటి విపత్తులను ఎదుర్కొని నష్టపోయిన వారిని ఏమాత్రం ఆదుకోలేదన్నారు.
 
అలాంటి రైతులను, బాధితులను సిఎం 1800 కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకున్నట్లు రోజా చెప్పారు. అలాగే ఈ నెల 29 వ తేదీన మరొక తుఫాన్, డిసెంబర్ 2వ తేదీన మూడవ తుఫాన్ వస్తుండడంతో అప్రమత్తంగా ఉంటూ ప్రజలను కాపాడాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించినట్లు రోజా చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments