Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మహిళలకు రక్షణ లేదు.. ఆ ముగ్గురు రాజీనామా చేయాలి.. రోజా

సెల్వి
సోమవారం, 21 అక్టోబరు 2024 (20:14 IST)
గోపవరం ఘటన నేపథ్యంలో మాజీ మంత్రి రోజా ఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. 
 
అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయన్నారు. మహిళలపై అకృత్యాలు కట్టడి చేయలేని కూటమి సర్కారు దిగిపోవాలని.. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత తమ పదవులకు రాజీనామా చేయాలని రోజా డిమాండ్ చేశారు. 
 
బద్వేల్‌లో యువతిపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేయడం, తెనాలిలో బ్రెయిన్ డెడ్ అయిన మహిళపై దాడి వంటి సంఘటనల గురించి రోజా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 
 
ఇన్ని విషాదాలు చోటు చేసుకున్నప్పటికీ బాధిత కుటుంబాలను పరామర్శించకుండా ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి టీవీ షో రికార్డింగ్‌కు హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు హైదరాబాద్ వెళ్లారని దుయ్యబట్టారు. జనసేనాని పవన్ కల్యాణ్ ఒక తండ్రిగా ఈ అకృత్యాలపై స్పందించాలన్నారు. 
 
టీడీపీ ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణకు బదులు పోలీసులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం రాజకీయ పగలు, వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడంపైనే ఎక్కువ దృష్టి సారిస్తోందని రోజా అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments