Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్ళని రెచ్చగొట్టడమే చంద్రబాబు పని, రోజా ఫైర్.?

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (22:24 IST)
రోజా మరోసారి ఫైరయ్యారు. ప్రతిపక్షనేత నారాచంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష నేత అంటే ఒక విలువ ఉండాలి. కానీ ప్రస్తుత ప్రతిపక్షనేత మాత్రం ఏం చేస్తారో అర్థం కాదు. ఎలా ప్రవర్తిస్తారో ఆయనకే తెలియదు.
 
రాష్ట్రప్రభుత్వం చేస్తున్న మంచి పనులపై స్పందించాల్సిన చంద్రబాబు వాటిలో లేనిపోని లొసుగులను వెతుక్కుంటూ కావాలనే ఒక వర్గం ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. చేనేత, పవర్ లూమ్స్ కార్మికులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని.. అయితే కావాలనే చంద్రబాబు కార్మికులను రెచ్చగొట్టి తన ఇంటి ముట్టడికి కారణమయ్యారన్నారు.
 
పవర్ లూమ్స్ కార్మికులతో కలిసి కొంతమంది ప్రజా సంఘాలు తన ఇంటిని ముట్టడించాయని.. తాను ఇంట్లో లేనని పిఎ చెప్పినా వారు వినిపించుకోలేదన్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారన్న విషయం అందరికీ తెలుసునని.. అంతకుమించి తాను మాట్లాడనంటూ ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు రోజా. 
 
చంద్రబాబునాయుడులో ఇప్పటికైనా మార్పు కోరుకుంటున్నానని.. మార్పు వస్తే బాగుంటుందన్నారు. కరోనా సమయంలో చేనేత కార్మికుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఆదుకున్నామని.. అలాగే చేనేత కార్మికులకు పథకాలన్నీ అందేవిధంగా చూశామన్నారు రోజా. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments