వాళ్ళని రెచ్చగొట్టడమే చంద్రబాబు పని, రోజా ఫైర్.?

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (22:24 IST)
రోజా మరోసారి ఫైరయ్యారు. ప్రతిపక్షనేత నారాచంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష నేత అంటే ఒక విలువ ఉండాలి. కానీ ప్రస్తుత ప్రతిపక్షనేత మాత్రం ఏం చేస్తారో అర్థం కాదు. ఎలా ప్రవర్తిస్తారో ఆయనకే తెలియదు.
 
రాష్ట్రప్రభుత్వం చేస్తున్న మంచి పనులపై స్పందించాల్సిన చంద్రబాబు వాటిలో లేనిపోని లొసుగులను వెతుక్కుంటూ కావాలనే ఒక వర్గం ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. చేనేత, పవర్ లూమ్స్ కార్మికులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని.. అయితే కావాలనే చంద్రబాబు కార్మికులను రెచ్చగొట్టి తన ఇంటి ముట్టడికి కారణమయ్యారన్నారు.
 
పవర్ లూమ్స్ కార్మికులతో కలిసి కొంతమంది ప్రజా సంఘాలు తన ఇంటిని ముట్టడించాయని.. తాను ఇంట్లో లేనని పిఎ చెప్పినా వారు వినిపించుకోలేదన్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారన్న విషయం అందరికీ తెలుసునని.. అంతకుమించి తాను మాట్లాడనంటూ ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు రోజా. 
 
చంద్రబాబునాయుడులో ఇప్పటికైనా మార్పు కోరుకుంటున్నానని.. మార్పు వస్తే బాగుంటుందన్నారు. కరోనా సమయంలో చేనేత కార్మికుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఆదుకున్నామని.. అలాగే చేనేత కార్మికులకు పథకాలన్నీ అందేవిధంగా చూశామన్నారు రోజా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments