Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రారంభ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొన్నఎమ్మెల్యే రోజా

Webdunia
బుధవారం, 28 జులై 2021 (15:03 IST)
చాలా రోజుల త‌ర్వాత ఎమ్మెల్యే రోజా త‌న న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వడమాలపేట మండలం పూడిలో 21 లక్షల రూపాయలతో నిర్మించనున్న రైతు భరోసా కేంద్రానికి ఆమె శంకుస్తాప‌న చేశారు. అలాగే, 17.50 లక్షలతో నిర్మించనున్న వెల్నెస్ సెంటర్ భవనం నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ఈ రెండింటికీ క‌లిపి  నిర్మించనున్న కాంపౌండ్ వాల్ కు ఎమ్మెల్యే ఆర్కే రోజా భూమి పూజ చేశారు. సచివాలయం భవనంలో 2.00 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బోరు మోటారు పనుల‌ను రోజా స్విచ్ ఆన్ చేసి ప్రారంభోత్సవం చేసారు. అస‌లే అస‌మ్మ‌తి సెగ‌తో ర‌గిలిపోతున్న న‌గ‌రి నియోజ‌క‌వర్గంలో మ‌ళ్లీ రోజా త‌న హవా కొన‌సాగిస్తున్నార‌ని ఆమె అనుచ‌రులు చెప్పారు.

ఎమ్మెల్యే నిరంత‌రం అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పైనే ఆలోచిస్తార‌ని, త‌న వెనుక నుంచి కుయుక్తులు ప‌న్నే వారిని రోజా ప‌ట్టించుకోర‌ని చెపుతున్నారు. ఎమ్మెల్యే రోజాకు వ‌చ్చే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ప‌ద‌వి ఖాయం అని పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments