Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రారంభ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొన్నఎమ్మెల్యే రోజా

Webdunia
బుధవారం, 28 జులై 2021 (15:03 IST)
చాలా రోజుల త‌ర్వాత ఎమ్మెల్యే రోజా త‌న న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వడమాలపేట మండలం పూడిలో 21 లక్షల రూపాయలతో నిర్మించనున్న రైతు భరోసా కేంద్రానికి ఆమె శంకుస్తాప‌న చేశారు. అలాగే, 17.50 లక్షలతో నిర్మించనున్న వెల్నెస్ సెంటర్ భవనం నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ఈ రెండింటికీ క‌లిపి  నిర్మించనున్న కాంపౌండ్ వాల్ కు ఎమ్మెల్యే ఆర్కే రోజా భూమి పూజ చేశారు. సచివాలయం భవనంలో 2.00 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బోరు మోటారు పనుల‌ను రోజా స్విచ్ ఆన్ చేసి ప్రారంభోత్సవం చేసారు. అస‌లే అస‌మ్మ‌తి సెగ‌తో ర‌గిలిపోతున్న న‌గ‌రి నియోజ‌క‌వర్గంలో మ‌ళ్లీ రోజా త‌న హవా కొన‌సాగిస్తున్నార‌ని ఆమె అనుచ‌రులు చెప్పారు.

ఎమ్మెల్యే నిరంత‌రం అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పైనే ఆలోచిస్తార‌ని, త‌న వెనుక నుంచి కుయుక్తులు ప‌న్నే వారిని రోజా ప‌ట్టించుకోర‌ని చెపుతున్నారు. ఎమ్మెల్యే రోజాకు వ‌చ్చే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ప‌ద‌వి ఖాయం అని పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments