Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఉక్కు పరిశ్రమపై బిజెపి నోరు విప్పాలి: రోజా

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (19:06 IST)
రాష్ట్రవ్యాప్తంగా ఉక్కు పరిశ్రమ ఉద్యమం ప్రారంభమైంది. విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రం ప్రైవేటుపరం చేయకూడదంటూ ప్రజా సంఘాలన్నీ కదం తొక్కాయి. ఒక్కో పార్టీ ఒక్కో విధంగా ఈ వ్యవహారంపై స్పందిస్తున్నాయి. అయితే ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు.
 
తిరుపతిలో మీడియతో మాట్లాడిన రోజా విశాఖ ఉక్కు పరిశ్రమపై బిజెపి ముందు మాట్లాడాలన్నారు. గతంలో బిజెపి నేతలే దీనిపై తీవ్రంగా స్పందించారని.. కాబట్టి వారే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయకుండా ఆపాలన్నారు. ఆ బాధ్యత బిజెపి రాష్ట్రనేతలు తీసుకుంటే కేంద్రం ఖచ్చితంగా స్పందిస్తుందన్నారు రోజా. 
 
అంతేకాకుండా విశాఖ ఉక్కుపై వైసిపి ముందు నుంచి ఒకే స్టాండ్‌తో ఉందని, అయితే కావాలనే ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం టిడిపితో పాటు మిగిలిన పార్టీలు మానుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments