Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూసీ కాల్వలో దూసుకెళ్లిన ట్రాక్టరు.. 14 మంది కూలీలు మృత్యువాత

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం వేములకొండ శివారు లక్ష్మాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు అదుపు తప్పిన ట్రాక్టరు రోడ్డు పక్కనే ఉన్న మూసీ కాల్వలోకి

Webdunia
ఆదివారం, 24 జూన్ 2018 (11:54 IST)
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం వేములకొండ శివారు లక్ష్మాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు అదుపు తప్పిన ట్రాక్టరు రోడ్డు పక్కనే ఉన్న మూసీ కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ట్రాక్టరులో ప్రయాణిస్తున్న 14 మంది వ్యవసాయ కూలీలు మృతి చెందారు. మృతులంతా వలిగొండ మండలం నందనం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.
 
ప్రమాదానికి గురైన ట్రాక్టరులో 30 మంది వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్నారు. ఉపాధి హామీ పనుల కోసం వీళ్లు ట్రాక్టరులో వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని కేసీఆర్ ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments