Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపూరి జిల్లాలో ఢీకొన్న లారీ - జీపు .. ముగ్గురి మృతి

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (08:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ జిల్లాలోని గుత్తి జాతీయ రహదారిపై జీపు, లారీ ఢీకొట్టుకొన్నాయి. ఈ ఘటనలో జీపులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మృతులందరినీ గుల్బర్గాకు చెందిన వారిగా గుర్తించారు. 
 
అనంతపూర్‌ నుంచి కర్నూలుకు వెళ్తున్న జీపును రాంగ్‌ రూట్‌లో వచ్చిన లారీ కారును ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జవగా.. లారీ రోడ్డుపై బోల్తాపడింది. జీపులోనే మృతదేహాలు చిక్కుపోయాయి. 
 
ఈ ప్రమాదం వార్త తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్రేన్‌ సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా.. అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులను అష్రఫ్‌ అలీ (68), లాయక్‌ అలీ (45)గా గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments