RK Roja: కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం ఎలా అనే మందును మంత్రులకు ఇచ్చారు.. రోజా ఫైర్

సెల్వి
శనివారం, 13 సెప్టెంబరు 2025 (15:44 IST)
RK Roja
ఏపీలోని సంకీర్ణ ప్రభుత్వంపై వైకాపా ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ సీఎ చంద్రబాబు నాయుడుతో పాటు హోంమంత్రి అనిత, సవితపై ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజీ కూడా నిర్మించలేదని వైసిపి నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. పేదలకు మెరగైన వైద్యం అందించాలనే సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పని చేశారని గుర్తు చేశారు. మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని దుయ్యబట్టారు. 
 
వైఎస్‌ఆర్ సిపి హయాంలో శరవేగంగా మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగాయని, మెడికల్ కాలేజీలలో మిగిలిన నిర్మాణ పనులు ప్రభుత్వమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తయారు చేసిన ఫేక్ వీడియోలను హోంమంత్రి అనిత మీడియాకు చూపించారని దుయ్యబట్టారు. 
 
పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు అనంతపురంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్పత్రిని నిర్మించారన్నారు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం ఎలా అనే మందును మంత్రులకు చంద్రబాబు ఇస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments