శివాజీని లోపలేసి మక్కెలిరగ కొడితే... రోజా సెన్సేనషనల్ కామెంట్స్

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (19:07 IST)
హీరో శివాజీని ఉద్దేశించి సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక్క సినిమా అవకాశం కూడా లేకుండా ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న శివాజీని ముందు పెట్టుకుని చంద్రబాబు 'ఆపరేషన్ గరుడ' అంటూ కొత్త నాటకాన్ని ప్రారంభించారని ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కొత్త నాటకానికి తెరలేపిన చంద్రబాబు, అడ్రస్‌లేని శివాజీతో కలసి డ్రామా ఆడుతున్నారని, ఆయనేదో కాలజ్ఞానిలాగా చెప్పారంటూ, దాన్ని ఇప్పుడు నమ్ముతున్నానంటూ పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. 
 
ముందుగానే ఒక స్క్రిప్టు రాయించి, దాన్ని శివాజీతో చెప్పించి, వెనుకనుంచి నడిపిస్తున్నది చంద్రబాబా? లోకేషా అన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. శివాజీని లోపలేసి మక్కెలిరగ కొడితే, అసలు నిజాలన్నీ బయటకు వస్తాయని ప్రతి ఒక్కరూ అంటున్నారని రోజా వ్యాఖ్యానించారు. 
 
జగన్‌పై దాడి జరిగిన తర్వాత గంట వ్యవధిలోనే నిందితుడు, జగన్ కలిసున్నారంటూ చూపించేలా మార్ఫింగ్ చేసిన ఫొటోలను మీడియాకు చూపించారని గుర్తు చేసిన ఆమె, జగన్ అభిమాని అయితే, వెనుక వైఎస్, విజయమ్మల చిత్రాలు ఉంటాయని, అదే విధంగా ప్లెక్సీని ముద్రించిన స్టూడియో పేరు తప్పనిసరిగా ఉంటుందని, అవేమీ ఇందులో లేవని రోజా గుర్తు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments