Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మా... నన్ను అపార్థం చేసుకున్నారు, నా రక్తంలో పోరాటముంది: రోజా

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (19:18 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు అయేషా మీరా తల్లి. సరిగ్గా 12 సంవత్సరాలకు ముందు అయేషా మీరాను అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. 
 
అయితే ఈ ఘటన జరిగిన సమయంలో టిడిపి మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారు రోజా. అప్పట్లో రోజా తీవ్రంగా స్పందించారు. అదలావుంటే అయేషా తల్లి మాట్లాడుతూ... నా కుమార్తె హత్య కేసులో సత్యం బాబు నిందితుడు కాదని నేను నెత్తి నోరు మొత్తుకున్నా. పట్టించుకోలేదు. నా కుమార్తె హత్య వెనుక రాజకీయ నేతల హస్తముంది. ఆ విషయం రోజాకు తెలుసు. కానీ ఆమె బయటకు చెప్పలేదు.
 
ప్రస్తుతం వారి పార్టీ అధికారంలో ఉంది.. ఇప్పుడు రోజా స్పందించాలి అంటూ ఆరోపించారు అయేషా మీరా తల్లి. దీనిపై తీవ్రంగా స్పందించారు రోజా. అయేషా మీరా తల్లిని... అమ్మా అంటూ సంబోధించిన రోజా, నా రక్తంలోనే పోరాటముంది. ఎక్కడ అమ్మాయికి అన్యాయం జరిగినా వెంటనే స్పందించే తత్వం నాది. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు.
 
మీరు నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అందులో ఎంతమాత్రం నిజం లేదు అంటున్నారు రోజా. ఎప్పుడైనాసరే మహిళల కోసం పోరాటం చేసే వారిలో నేను ముందువరుసలో ఉంటానని చెప్పారు రోజా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా నాయుడు రాకతో అల్లకల్లోలాన్ని రేపిన సునీల్ గ్రోవర్‌

Ajay Devgn : నేను డ్యాన్స్‌ని యాక్షన్‌గా చూస్తా : జాకీ చాన్

ఆదర్శవంతమైన పాలకులుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయిక : నారా రోహిత్

ప్రభుత్వానికి వారధి ఫిలింఛాంబర్ మాత్రమే - త్వరలో కాంప్రహెన్సివ్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీ : పవన్ కళ్యాణ్

అతీంద్రియ శక్తుల గల శంబాల లో బాలుగా శివకార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments