Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మా... నన్ను అపార్థం చేసుకున్నారు, నా రక్తంలో పోరాటముంది: రోజా

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (19:18 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు అయేషా మీరా తల్లి. సరిగ్గా 12 సంవత్సరాలకు ముందు అయేషా మీరాను అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. 
 
అయితే ఈ ఘటన జరిగిన సమయంలో టిడిపి మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారు రోజా. అప్పట్లో రోజా తీవ్రంగా స్పందించారు. అదలావుంటే అయేషా తల్లి మాట్లాడుతూ... నా కుమార్తె హత్య కేసులో సత్యం బాబు నిందితుడు కాదని నేను నెత్తి నోరు మొత్తుకున్నా. పట్టించుకోలేదు. నా కుమార్తె హత్య వెనుక రాజకీయ నేతల హస్తముంది. ఆ విషయం రోజాకు తెలుసు. కానీ ఆమె బయటకు చెప్పలేదు.
 
ప్రస్తుతం వారి పార్టీ అధికారంలో ఉంది.. ఇప్పుడు రోజా స్పందించాలి అంటూ ఆరోపించారు అయేషా మీరా తల్లి. దీనిపై తీవ్రంగా స్పందించారు రోజా. అయేషా మీరా తల్లిని... అమ్మా అంటూ సంబోధించిన రోజా, నా రక్తంలోనే పోరాటముంది. ఎక్కడ అమ్మాయికి అన్యాయం జరిగినా వెంటనే స్పందించే తత్వం నాది. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు.
 
మీరు నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అందులో ఎంతమాత్రం నిజం లేదు అంటున్నారు రోజా. ఎప్పుడైనాసరే మహిళల కోసం పోరాటం చేసే వారిలో నేను ముందువరుసలో ఉంటానని చెప్పారు రోజా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments