Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మగడ్డ చంద్రబాబు ఒత్తిడితో దిగజారుడు పనులు చేస్తున్నారు: రోజా

Webdunia
ఆదివారం, 24 జనవరి 2021 (18:56 IST)
కోవిడ్ తక్కువ ఉన్న సమయంలో ప్రజల ప్రాణాలకు ముప్పు అన్నారు. ఇప్పుడు కరోనా పెద్ద ఎత్తున విజృంభిస్తున్న సమయంలో ఎస్ఈసీ నిర్ణయం సబబు కాదు. వాక్సిన్ ప్రక్రియ పూర్తి కాకముందే ఉద్యోగులు, ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏంటి..? అని ప్రశ్నించారు రోజా.
 
సీఎం జగన్ ఎన్నికలకు భయపడి పారిపోతున్నాడని ఆరోపించడం సమంజసం కాదు. 2018లో చంద్రబాబు స్థానిక ఎన్నికలు చూసి పారిపోయాడు. కోవిడ్ సమయంలో ఎవరికీ ఎటువంటి సహాయ సహకారాలు చంద్రబాబు అందించలేదు. సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి సానుకూలంగా తీర్పు వస్తుందని అనుకుంటున్నా.
 
ఎన్నికలు జరపాలని న్యాయస్థానం ఆదేశిస్తే, న్యాయస్థానాన్ని గౌరవించి ఎన్నికలు జరుపుతాం. ప్రజల శ్రేయస్సు కోసమే ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్నాం. ఎన్నికలకు వైసీపీ పార్టీ ఎప్పుడైనా సిద్దమే, మా సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష.
 
కలెక్టర్ గారి ప్రవర్తనపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసాం. అధికారులతో పాటు మాకు అభివృద్ధిపై బాధ్యత ఉంటుంది. కలెక్టర్ ప్రోటోకాల్ పాటించకపోవడం బాధ వేసింది అని అన్నారు రోజా.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments