Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో రిక్షా కార్మికునికి తీవ్ర గాయాలు, మానవత్వం చాటుకున్న కంచికచర్ల ఎస్సై రంగనాథ్

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (22:08 IST)
కంచికచర్ల చెరువు కట్ట సమీపంలో ఆదివారం రాత్రి రిక్షా కార్మికుడిని టిప్పర్ లారీ ఢీ కొట్టిన ఘటనలో రిక్షా కార్మికుడు కావాట్టి పుల్లయ్య (50) తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న కంచికచర్ల ఎస్సై ఎంపీఎస్ఎస్ రంగనాథ్ సంఘటన స్థలానికి చేరుకొని రోడ్డుపై అచేతనంగా పడి ఉన్న పుల్లయ్యను చేతిలోనికి తీసుకొని తలకు తగిలిన గాయాన్ని చేతి రుమాలుతో మూసి రక్తస్రావాన్ని ఆపారు.
 
పుల్లయ్య అపస్మారక స్థితిలోకి చేరుకోకుండా మాట్లాడుతూ ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన రహదారి అంబులెన్స్ సిబ్బంది ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని పుల్లయ్యను చికిత్స నిమిత్తం నందిగామ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.
 
ప్రమాదం కారణంగా ఏర్పడిన ట్రాఫిక్‌ను ఎస్సై మరియు పోలీస్ సిబ్బంది సరిచేసి అంబులెన్స్ వెళ్లేందుకు మార్గం చూపించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ పరారీ కాగా టిప్పర్‌ను కంచికచర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments