Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంచం అడిగిన రెవెన్యూ అధికారి.. అడ్డంగా బుక్ చేసిన రైతు..

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (17:23 IST)
లంచం అడిగిన అధికారులను రైతు అడ్డంగా బుక్ చేశాడు. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టించాడు. రైతు భూమికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేసేందుకు రూ 23 వేలు లంచం అడిగారు రెవెన్యూ అధికారులు. కడ్తాల్‌కు చెందిన రైతు ఎర్రోళ్ల వెంకటేశ్‌ తన పొలంలో షెడ్డు నిర్మించాలనుకున్నాడు. ఇందుకు రుణం పొందడానికి బ్యాంక్ అధికారులను సంప్రదించారు. 
 
రుణం ఇవ్వాలంటే భూమికి సంబంధించిన ఎన్వోసీ తీసుకురావాలని బ్యాంక్ అధికారులు సూచించారు. గతేడాది భూ దస్త్రాల ప్రక్షాళన సమయంలో వెంకటేశ్‌ ఎన్వోసీ కోసం రంగారెడ్డి జిల్లా మండల కేంద్రం కడ్తాల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. 1.25 గుంటల భూమికి ఎన్వోసీ మంజూరు చేయడానికి ఆర్‌ఐ శ్రవణ్‌కుమార్‌, నలుగురు సిబ్బంది రూ.23 వేలు లంచం అడిగారు. 
 
అది ఇచ్చుకోలేని రైతు ఏమి చేయాలో తోచక అనిశా అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు సోమవారం రెవెన్యూ సిబ్బందికి రైతు లంచం ఇస్తుండగా. అనిశా అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, ఐదుగురిపై కేసు నమోదు చేసారు. మంగళవారం వీరిని కోర్టులో హాజరుపరిచి చంచల్‌గూడ జైలుకు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. తనలాగే మరొకరికి జరగకూడదనే అనిశాని సంప్రదించానని రైతు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments