Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంచం అడిగిన రెవెన్యూ అధికారి.. అడ్డంగా బుక్ చేసిన రైతు..

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (17:23 IST)
లంచం అడిగిన అధికారులను రైతు అడ్డంగా బుక్ చేశాడు. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టించాడు. రైతు భూమికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేసేందుకు రూ 23 వేలు లంచం అడిగారు రెవెన్యూ అధికారులు. కడ్తాల్‌కు చెందిన రైతు ఎర్రోళ్ల వెంకటేశ్‌ తన పొలంలో షెడ్డు నిర్మించాలనుకున్నాడు. ఇందుకు రుణం పొందడానికి బ్యాంక్ అధికారులను సంప్రదించారు. 
 
రుణం ఇవ్వాలంటే భూమికి సంబంధించిన ఎన్వోసీ తీసుకురావాలని బ్యాంక్ అధికారులు సూచించారు. గతేడాది భూ దస్త్రాల ప్రక్షాళన సమయంలో వెంకటేశ్‌ ఎన్వోసీ కోసం రంగారెడ్డి జిల్లా మండల కేంద్రం కడ్తాల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. 1.25 గుంటల భూమికి ఎన్వోసీ మంజూరు చేయడానికి ఆర్‌ఐ శ్రవణ్‌కుమార్‌, నలుగురు సిబ్బంది రూ.23 వేలు లంచం అడిగారు. 
 
అది ఇచ్చుకోలేని రైతు ఏమి చేయాలో తోచక అనిశా అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు సోమవారం రెవెన్యూ సిబ్బందికి రైతు లంచం ఇస్తుండగా. అనిశా అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, ఐదుగురిపై కేసు నమోదు చేసారు. మంగళవారం వీరిని కోర్టులో హాజరుపరిచి చంచల్‌గూడ జైలుకు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. తనలాగే మరొకరికి జరగకూడదనే అనిశాని సంప్రదించానని రైతు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments