Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ తప్ప మరొకటి కాదు.. రేవంతన్న ఫైర్

సెల్వి
శనివారం, 16 మార్చి 2024 (22:28 IST)
Revanth Reddy _Sharmila
తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు రేవంత్ రెడ్డి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై నిప్పులు చెరిగారు రేవంత్. వైఎస్ షర్మిల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు.
 
బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ తప్ప మరొకటి కాదంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. వారంతా మోదీతో సంధిలో ఉన్నారని, ఏపీ ప్రజల హక్కుల కోసం మోదీకి వ్యతిరేకంగా పోరాడే దమ్ము ఎవరికీ లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 
 
మొదటి ఐదేళ్లు చంద్రబాబు సీఎంగా ఉండి, ఆ తర్వాత ఐదేళ్లు జగన్ అధికారంలో ఉన్నా ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు? పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదు? మనకు స్థిరమైన రాజధాని ఎందుకు లేదు? కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ అనిశ్చితులు తొలగిపోతాయి.
 
 వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే పట్టుదలతో ఉన్న వైఎస్ షర్మిలకు మద్దతుగా వైజాగ్ వచ్చినట్లు రేవంత్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments