Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయేషా మృతదేహానికి రీ పోస్టుమార్టం పూర్తి

Webdunia
శనివారం, 14 డిశెంబరు 2019 (14:14 IST)
అత్యాచారం, హత్యకు గురైన ఆయేషామీరా మృతదేహానికి రీపోస్టుమార్టం పూర్తయింది. దిల్లీ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు ఆయేషా మృతదేహం ఆనవాళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఆధారాలు సేకరించి నివేదిక తయారుచేస్తామని అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలోని శ్మశానవాటికలో పోస్టుమార్టం నిర్వహించారు. ఫోరెన్సిక్‌ నిపుణుల బృందం శవపరీక్ష పూర్తి చేశారు. సీబీఐ ఎస్పీ విమల్‌ ఆదిత్య నేతృత్వంలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. ఆయేషామీరా మృతదేహం వెలికితీసి... ఫోరెన్సిక్ నిపుణులు ఆనవాళ్లు నమోదు చేసుకున్నారు.

రీపోస్టుమార్టంలో పుర్రె, అస్థికలపై చిట్లిన గాయాలను, ఎముకలు, కేశాలు, గోళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆధారాలు సేకరించి పూర్తి నివేదిక తయారుచేయనున్నట్లు ఫోరెన్సిక్ బృందం తెలిపింది. ఆయేషామీరా ఎముకల నుంచి అవశేషాలను ఫోరెన్సిక్‌ బృందం సేకరించింది.

ఆయేషా మీరా 2007 డిసెంబర్‌ 27న అత్యాచారం, హత్యకు గురైన విషయం తెలిసిందే. సీబీఐ విచారణలో భాగంగా ఫోరెన్సిక్‌ నిపుణులు రీపోస్టుమార్టం నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments