Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయేషా మృతదేహానికి రీ పోస్టుమార్టం పూర్తి

Webdunia
శనివారం, 14 డిశెంబరు 2019 (14:14 IST)
అత్యాచారం, హత్యకు గురైన ఆయేషామీరా మృతదేహానికి రీపోస్టుమార్టం పూర్తయింది. దిల్లీ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు ఆయేషా మృతదేహం ఆనవాళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఆధారాలు సేకరించి నివేదిక తయారుచేస్తామని అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలోని శ్మశానవాటికలో పోస్టుమార్టం నిర్వహించారు. ఫోరెన్సిక్‌ నిపుణుల బృందం శవపరీక్ష పూర్తి చేశారు. సీబీఐ ఎస్పీ విమల్‌ ఆదిత్య నేతృత్వంలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. ఆయేషామీరా మృతదేహం వెలికితీసి... ఫోరెన్సిక్ నిపుణులు ఆనవాళ్లు నమోదు చేసుకున్నారు.

రీపోస్టుమార్టంలో పుర్రె, అస్థికలపై చిట్లిన గాయాలను, ఎముకలు, కేశాలు, గోళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆధారాలు సేకరించి పూర్తి నివేదిక తయారుచేయనున్నట్లు ఫోరెన్సిక్ బృందం తెలిపింది. ఆయేషామీరా ఎముకల నుంచి అవశేషాలను ఫోరెన్సిక్‌ బృందం సేకరించింది.

ఆయేషా మీరా 2007 డిసెంబర్‌ 27న అత్యాచారం, హత్యకు గురైన విషయం తెలిసిందే. సీబీఐ విచారణలో భాగంగా ఫోరెన్సిక్‌ నిపుణులు రీపోస్టుమార్టం నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments