Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో విద్యుత్ బస్సులకు మళ్లీ టెండర్లు..!

ఏపీలో విద్యుత్ బస్సులకు మళ్లీ టెండర్లు..!
, శనివారం, 14 డిశెంబరు 2019 (13:52 IST)
ఏపీలో లీజు ప్రాతిపదికన తీసుకోనున్న విద్యుత్‌ బ‌స్సుల కోసం మళ్లీ టెండర్లు పిలవాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. విద్యుత్‌ బస్సులకు సంబంధించి న్యాయసమీక్ష కమిషన్‌ పలు అభ్యంతరాలను వ్యక్తం చేసింది.

ఈ సూచనల ఆధారంగా విద్యుత్‌ బస్సుల టెండర్లలో మార్పులు, చేర్పులు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌ విధానంలో 350 విద్యుత్ బ‌స్సులను లీజుకు తీసుకోవాల‌ని నిర్ణయించిన ఆర్టీసీ... టెండర్లు పిలిచింది. సీఎం ఆదేశాలతో వాటిని రద్దు చేసి న్యాయసమీక్ష కమిషన్‌ పరిశీలనకు పంపారు. ఆన్‌లైన్ విధానంలో ప్రజ‌ల నుంచి సూచనలు స్వీక‌రించడంతో పాటు.. ఎలక్ట్రిక్‌ బస్సుల ప్రతిపాదనపై న్యాయసమీక్ష క‌మిష‌న్ అధ్యయ‌నం చేసింది.

కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్ బి.శివశంకర్‌రావు ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేశారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బ‌స్సులు న‌డ‌పాల్సిన అవ‌సరం లేద‌ని ప్రభుత్వానికి చేసిన సిఫార్సుల‌లో న్యాయసమీక్ష కమిషన్ పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పామును రక్షించబోయీ.... ఏమైందో చూడండి