Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరసరావుపేట ఎంపీ సీటును కడపోళ్లకు ఇస్తే ఓడిస్తాం : రాయపాటి

Webdunia
మంగళవారం, 24 జనవరి 2023 (11:48 IST)
నరసరావుపేట ఎంపీ సీటును కడపకు చెందిన వారికి ఇస్తే మాత్రం తప్పకుండా ఓడించి తీరుతామని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. తాడికొండ నియోజకవర్గ టీడీపీ నేత తోకల రాజవర్థన్ రావు ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పుట్టిన రోజు వేడుకలను సోమవారం గుంటూరు అమరావతి రోడ్డులోని బండ్లమూడి గార్డెన్స్‌లో నిర్వహించారు. 
 
ఇందులో రాయపాటి సాంబశివరావు కూడా పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా తాను పోటీ చేయడం లేదన్నారు. అయితే, మా కుటుంబం నుంచి పోటీ చేసేందుకు (కుమారుడు, కుమార్తె) రెండు సీట్లు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని కోరినట్టు చెప్పారు. 
 
అలాగే, తాడికొండ సీటును తోకల రాజవర్థన్ రావుకు ఇవ్వాలని, ఆయన అక్కడ సులభంగా గెలుస్తారని చెప్పినట్టు తెలిపారు. నరసరావుపేట ఎంపీ సీటును మాత్రం కడపోళ్లకు ఇస్తే ఓడించి తీరుతామని, అవసరమైతే నేనే ఎంపీగా పోటీ చేస్తానని, నేను పోటీలోకి దిగితే వీళ్లు ఎవరూ పనికిరారని చెప్పారు. 
 
తన సీటు వేరే ఎవరికో ఇస్తానంటే మాత్రం చూస్తూ ఊరుకోం అని ఆయన చెప్పారు. అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హీరో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంటే మంచిదేనని రాయపాటి సాంబశివరావు అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments