Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరసరావుపేట ఎంపీ సీటును కడపోళ్లకు ఇస్తే ఓడిస్తాం : రాయపాటి

Webdunia
మంగళవారం, 24 జనవరి 2023 (11:48 IST)
నరసరావుపేట ఎంపీ సీటును కడపకు చెందిన వారికి ఇస్తే మాత్రం తప్పకుండా ఓడించి తీరుతామని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. తాడికొండ నియోజకవర్గ టీడీపీ నేత తోకల రాజవర్థన్ రావు ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పుట్టిన రోజు వేడుకలను సోమవారం గుంటూరు అమరావతి రోడ్డులోని బండ్లమూడి గార్డెన్స్‌లో నిర్వహించారు. 
 
ఇందులో రాయపాటి సాంబశివరావు కూడా పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా తాను పోటీ చేయడం లేదన్నారు. అయితే, మా కుటుంబం నుంచి పోటీ చేసేందుకు (కుమారుడు, కుమార్తె) రెండు సీట్లు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని కోరినట్టు చెప్పారు. 
 
అలాగే, తాడికొండ సీటును తోకల రాజవర్థన్ రావుకు ఇవ్వాలని, ఆయన అక్కడ సులభంగా గెలుస్తారని చెప్పినట్టు తెలిపారు. నరసరావుపేట ఎంపీ సీటును మాత్రం కడపోళ్లకు ఇస్తే ఓడించి తీరుతామని, అవసరమైతే నేనే ఎంపీగా పోటీ చేస్తానని, నేను పోటీలోకి దిగితే వీళ్లు ఎవరూ పనికిరారని చెప్పారు. 
 
తన సీటు వేరే ఎవరికో ఇస్తానంటే మాత్రం చూస్తూ ఊరుకోం అని ఆయన చెప్పారు. అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హీరో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంటే మంచిదేనని రాయపాటి సాంబశివరావు అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments