Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రేష‌న్ డీల‌ర్ల ఆందోళ‌న ... త‌గ్గేదేలా అన్న మంత్రి కొడాలి నాని

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (11:14 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో చౌక ధర దుకాణ డీలర్ల ఆందోళనలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. జీవో నంబర్ 10 రద్దుతో, బియ్యం బ‌స్తా సంచుల విష‌యంలో వివాదాన్ని, ఇత‌ర సమస్యలను పరిష్కరించాలంటూ రేషన్ డీలర్లు ఆందోళన చేస్తున్నారు. సీఎం జగన్ తమ సమస్యలపై స్పందించే వరకు నిరసనలు కొనసాగుతాయని వారు స్పష్టం చేస్తున్నారు.
 
 
ఉన్నతాధికారులతో చర్చలు జ‌ర‌పాల‌ని ప్ర‌భుత్వం నిర్దేశించ‌గా, రేషన్ డీలర్లతో ఉన్నతాధికారులు బుధవారం చర్చలు జరిపారు. రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ గిరిజాశంకర్​తో జరిపిన చర్చలు ఇంకా ఒక కొలిక్కిరాలేదు. దీనితో ఇవాళ కూడా గిడ్డంగుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు డీలర్లు తెలిపారు.

 
అయితే, దీనిపై ఏపీ పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కొడాలి నాని ఘాటుగానే స్పందించారు. వారు ద‌ర్నాలు చేసి, బెదిరిస్తే, తాము త‌గ్గేదేలేద‌న్నారు. రేష‌న్ బియ్యం పంపిణీ ఆగదని తేల్చి చెప్పారు. రేషన్ డీలర్లు ధర్నాకు దిగితే రేషన్ పంపిణీ ఆగదని మంత్రి కొడాలి నాని అన్నారు. రేషన్ సరఫరా వాహనాలు ఉన్నాయని, ఇంటింటికి వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని డీలర్లకు సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

పెద్ది సినిమా గేమ్ ఛేంజర్ కాబోతోంది.. రామ్ గోపాల్ వర్మ కితాబు

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments