Webdunia - Bharat's app for daily news and videos

Install App

50 మంది బాలికలపై అకృత్యానికి పాల్పడిన కామాంధుడికి జైలు

50 మంది బాలికలపై అకృత్యానికి పాల్పడిన కామాంధుడికి జైలు
Webdunia
సోమవారం, 12 నవంబరు 2018 (19:56 IST)
అభంశుభం తెలియని చిన్నారులను లైంగికంగా వేధించాడు. పది సంవత్సరాల పాటు బెదిరించి కొంతమంది బాలికలపై పైశాచికత్వానికి పాల్పడ్డాడు. గర్భం దాలిస్తే తీయించాడు. ఇలా ఒకరిద్దరు కాదు ఎంతోమంది మైనర్ బాలికలపై ఆకృత్యానికి పాల్పడిన తిరుపతికి చెందిన ప్రభుత్వ బాలిక వసతి గృహం కామాంధుడికి శిక్ష పడింది. ఒక మైనర్ బాలిక ప్రాణాలకు తెగించి కామాంధుడి దురాగతాలను బయట పెట్టడంతో కటాకటాల్లో శిక్ష అనుభవిస్తున్నాడు కామాంధుడు. 
 
తిరుపతి సరోజినీదేవి రోడ్డులోని బాలికల వసతి గృహం సూపరింటెండెంట్ నందగోపాల్ గత పదిసంవత్సరాలుగా మైనర్ బాలికపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు. ఎవరూ లేని అనాథ పిల్లలను బెదిరించి లొంగదీసుకొని వారి జీవితంతో చెలగాటమాడుకుంటున్నాడు. కడప జిల్లాకు చెందిన ఒక మైనర్ బాలిక తల్లి మరణించి, తండ్రి ఒక కేసులో జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. దీంతో ఆ బాలిక ప్రభుత్వ వసతి గృహంలో 2014 సంవత్సరంలో చేరింది.
 
అప్పటి నుంచి సూపరింటెండెంట్ గోపాల్ ఆ మైనర్ బాలికను లొంగదీసుకుని రెండుసార్లు అబార్షన్ కూడా చేయించాడు. ఈ బాలిక ఒక్కటే కాదు.. ఇంకా చాలామంది ఉన్నారు. సూపరింటెండెంట్ దురాగతాలను ఐదేళ్ళ పాటు ఓర్చుకుంటూ వచ్చిన బాలిక కడప వసతి గృహానికి వెళ్లింది. అక్కడకు వెళ్ళగానే కొంతమంది బాలికల సహాయంతో మహిళా సంఘాల దృష్టికి తీసుకెళ్ళింది. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి నందగోపాల్ పైన కేసు కూడా నమోదు చేశారు. ఈరోజు తెల్లవారుజామున నిందితునిపై పోక్సో యాక్ట్ కింద అరెస్టు చేసి తిరుపతి సబ్ బైలుకు తరలించారు. నిందితుడికి 14 రోజుల రిమాండ్‌ను విధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం