Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీపు నడపాలనుకున్న ఓ వ్యక్తి సరదా... ముగ్గురు దుర్మరణం.. 14 మందికి గాయాలు

జీపు నడపాలనుకున్న ఓ వ్యక్తి సరదా ముగ్గురి మరణానికి దారితీయడమేకాకుండా, 14 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటనలో జీపు నడుపుతున్న వ్యక్తితోపాటు ఇద్దరు దంపతులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2016 (13:06 IST)
జీపు నడపాలనుకున్న ఓ వ్యక్తి సరదా ముగ్గురి మరణానికి దారితీయడమేకాకుండా, 14 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటనలో జీపు నడుపుతున్న వ్యక్తితోపాటు ఇద్దరు దంపతులు కూడా ప్రాణాలు కోల్పోయారు. గాయపడినవారిలో ఏడుగురు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. విశాఖపట్టణం జిల్లా జి.మాడుగుల మండలం వంజరి ఘాట్‌ రోడ్డులో ఈ ప్రమాదం సంభవించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... గెమ్మెలి గ్రామానికి చెందిన గుల్లెల కేశవరావు, గుల్లెల చిన్నబ్బాయి కుటుంబాల వారు, పాడేరు మండలం మినుములూరులో వివాహ సంబంధం గురించి మాట్లాడేందుకు వెళ్లాలనుకున్నారు. ఇందుకోసం అదే గ్రామానికి చెందిన కృష్ణ అనే వ్యక్తికి చెందిన జీపును మాట్లాడుకున్నారు. మొత్తం 17 మంది కలిసి మినుములూరు పయనమ్యారు. అయితే గుల్లెల కేశవరావుకు సొంత జీపు ఉండటంతో పాటు డ్రైవింగ్‌ కూడా వచ్చు. తాను జీపు నడుపుతానని కేశవరావు చెప్పడంతో, కృష్ణ పక్కకు తప్పుకుని, స్టీరింగ్‌ కేశవరావుకు ఇచ్చాడు. 
 
గెమ్మెలి దాటిన తర్వాత వంజరి ఘాట్‌ దిగుతున్న సమయంలో వేగంగా వెళుతున్న జీపును కేశవరావు అదుపు చేయలేక, రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టాడు. అతివేగంగా వచ్చి చెట్టును ఢీకొనడంతో కేశవరావుతో పాటు, దంపతులు చిన్నబ్బాయి, వరహాలమ్మ అక్కడిక్కడే మృతి చెందారు. జీపులో ఉన్న మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కేశవరావు భార్య మచ్చమ్మ కూడా వుంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments