Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నాన్న.. సారీ, అమ్మ.. సారీ, చరిత సారీ'... వివాహమైన 13 రోజులకే కానిస్టేబుల్ సూసైడ్

కడప జిల్లా ముద్దనూరు పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పిల్లనాగన్నగారి రాజు (26) అనే కానిస్టేబుల్ వివాహమైన 13 రోజులకే ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు సేవించి ఈ దారుణానికి పాల్పడ్డాడు

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2016 (12:30 IST)
కడప జిల్లా ముద్దనూరు పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పిల్లనాగన్నగారి రాజు (26) అనే కానిస్టేబుల్ వివాహమైన 13 రోజులకే ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు సేవించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే.. కొండాపురం మండలం బుక్కపట్నం గ్రామానికి చెందిన సుబ్బరాయుడు, సబ్బమ్మకు ముగ్గురు కుమారులు వారిలో రాజు రెండో కుమారుడు. 2011లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. జనవరి 2012లో ముద్దనూరు పోలీస్ స్టేషన్‌ బాధ్యతలు చేపట్టాడు. 2016 ఆగస్టు 4న ముద్దనూరు మండల కొర్రపాడు గ్రామానికి చెందిన చరితను వివాహం చేసుకున్నాడు. 
 
ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం విధుల అనంతరం ఇంటికెళ్లాడు. రాత్రి కూడా డ్యూటీ చేయాల్సి ఉంది. డ్యూటీకి రాకపోవడంతో పోలీసులు ఫోన్‌ చేశారు. లిఫ్ట్‌ చేయలేదని, ఇంటికి ఫోన్‌ చేశారు. భోజనానికి కూడా రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బంగారు చైన్‌, రింగు సెల్‌ఫోన్‌ ఇంట్లో ఉన్నాయి. రాత్రి అన్ని చోట్ల వెతికినా ఆచూకీ తెలియలేదు.
 
బుధవారం ఉదయం పెద్దముడియం, కొండాపురం, మైలవరం, ముద్దనూరు పరిసరప్రాంతాల్లో పరిశీలించగా మునయ్య కోన వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. సమాచారాన్ని పోలీసులకు చేరవేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments