Webdunia - Bharat's app for daily news and videos

Install App

100-200 వరకు గుంజీలు.. 50 మంది విద్యార్థినిలు అస్వస్థత (video)

సెల్వి
మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (11:10 IST)
క్ర‌మ‌శిక్ష‌ణ పేరిట విద్యార్థినుల‌ చేత గుంజీలు తీయించారు. ఏపీలోని అల్లూరి జిల్లా రంప‌చోడ‌వ‌రంలోని ఏపీఆర్ బాలిక‌ల జూనియ‌ర్ క‌ళాశాల‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. వరుసగా మూడు రోజులు బాలికలను వంద నుంచి 200 వరకు గుంజీలు తీయించడంతో 50 మంది విద్యార్థినిలు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. 
 
కొంద‌రు న‌డ‌వ‌లేని స్థితికి చేరుకున్నారు. త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం అంద‌డంతో వారు కాలేజీకి చేరుకుని పిల్ల‌ల‌ను ఏరియా ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. ప్ర‌స్తుతం వారు చికిత్స పొందుతున్నారు. కాగా, బాలిక‌ల‌ను చేతు‌ల‌పై మోసుకెళ్తున్న వీడియోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. 
 
క్ర‌మ‌శిక్ష‌ణ పేరుతో ప్రిన్సిప‌ల్ ప్ర‌సూన, పీడీ కృష్ణ‌కుమారి విద్యార్థినుల‌తో గుంజీలు తీయించారు. ఇంట‌ర్ మొద‌టి, రెండో సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థినులు.. తాము చెప్పిన మాట విన‌డం లేద‌ని ఈ పని చేయించారు. 
 
క్ర‌మ‌శిక్ష‌ణ పేరిట విద్యార్థినుల‌ చేత గుంజీలు తీయించ‌డం దారుణ‌మైన చ‌ర్య అని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని ఐటీడీఏ పీఓ క‌ట్టా సింహాచ‌లాన్ని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Shankar: అవతార్ లాగా తన కలల ప్రాజెక్ట్ వేల్పారి చేయబోతున్న తమిళ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments