Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామోజీ రావు అంతిమ యాత్ర ప్రారంభం.. ముందే సిద్ధం చేసుకున్న స్మారక స్థలం

వరుణ్
ఆదివారం, 9 జూన్ 2024 (09:57 IST)
రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అంతిమయాత్ర ప్రారంభమైంది. రామోజీ ఫిల్మ్‌సిటీలోని నివాసం నుంచి ప్రారంభమైన యాత్ర.. ఆయన ముందే సిద్ధం చేసుకున్న స్మారక కట్టడం వరకు కొనసాగనుంది. అక్షర యోధుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు వివిధ పార్టీలకు చెందిన నేతలు, రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు, ప్రజలు తరలివచ్చారు. కుటుంబసభ్యులు చివరిసారిగా కన్నీటి వీడ్కోలు తెలిపారు.
 
రామోజీరావు తన స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే ఇప్పుడు అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. రామోజీరావు అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. 
 
కాగా, రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం ఉదయం జరుగుతున్నాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఫిలింసిటీలోని స్మృతివనంలో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలను సీఎస్ శాంతి కుమారి జారీచేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వం నుంచి ముగ్గురు అధికారులు పాల్గొననున్నారు. రామోజీరావు మృతికి సంతాపంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆది, సోమవారాలు సెలవుదినంగా ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments