Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రెస్ అకాడమీ చైర్మన్ గా రామచంద్రమూర్తి?.. జగన్ సర్కార్ లో తెలంగాణ వాసులకు పెద్దపీట

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (19:08 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో తెలంగాణ వాసికి పెద్ద పీట వేయబోతున్నదా? అవుననే అంటున్నాయి పరిశీలక వర్గాలు. తెలంగాణ వాదులకు జగన్ సర్కార్ అందలం కల్పిస్తున్నదని ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఇప్పటికే ఆక్షేపించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ మరో తెలంగాణ వాసిని కీలక పదవిలో నియమించనున్నట్లు తెలిసింది. ఇటీవలి కాలం వరకు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా వ్యవహరిచిన కె. రామచంద్ర మూర్తిని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమించనున్నట్లు తెలిసింది.

జగన్ సర్కార్ లో సమాచార శాఖ కమిషనర్ విజయకుమార్ (నల్లగొండ), కమ్యూనికేషన్స్ సలహాదారుగా కృష్ణమోహన్ (ఖమ్మం), జాతీయ మీడియా సలహాదారుగా దేవులపల్లి అమర్ (వరంగల్) నియమితులైన విషయం విదితమే. పీఆర్వో విభాగంలోనూ పలువురు తెలంగాణ వాసులకు అవకాశం లభించింది.

తాజాగా ప్రెస్ అకాడమీ చైర్మన్ గా రామచంద్రమూర్తి (ఖమ్మం)కి జగన్ అవకాశం కల్పించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా తెలంగాణ వాసులకు ఏపీ ప్రభుత్వంలో సీఎం జగన్ కల్పిస్తున్న అవకాశాలు జర్నలిస్టు సర్కిళ్ళలో హాట్ టాపిక్ గా మారాయి.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments