Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రెస్ అకాడమీ చైర్మన్ గా రామచంద్రమూర్తి?.. జగన్ సర్కార్ లో తెలంగాణ వాసులకు పెద్దపీట

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (19:08 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో తెలంగాణ వాసికి పెద్ద పీట వేయబోతున్నదా? అవుననే అంటున్నాయి పరిశీలక వర్గాలు. తెలంగాణ వాదులకు జగన్ సర్కార్ అందలం కల్పిస్తున్నదని ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఇప్పటికే ఆక్షేపించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ మరో తెలంగాణ వాసిని కీలక పదవిలో నియమించనున్నట్లు తెలిసింది. ఇటీవలి కాలం వరకు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా వ్యవహరిచిన కె. రామచంద్ర మూర్తిని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమించనున్నట్లు తెలిసింది.

జగన్ సర్కార్ లో సమాచార శాఖ కమిషనర్ విజయకుమార్ (నల్లగొండ), కమ్యూనికేషన్స్ సలహాదారుగా కృష్ణమోహన్ (ఖమ్మం), జాతీయ మీడియా సలహాదారుగా దేవులపల్లి అమర్ (వరంగల్) నియమితులైన విషయం విదితమే. పీఆర్వో విభాగంలోనూ పలువురు తెలంగాణ వాసులకు అవకాశం లభించింది.

తాజాగా ప్రెస్ అకాడమీ చైర్మన్ గా రామచంద్రమూర్తి (ఖమ్మం)కి జగన్ అవకాశం కల్పించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా తెలంగాణ వాసులకు ఏపీ ప్రభుత్వంలో సీఎం జగన్ కల్పిస్తున్న అవకాశాలు జర్నలిస్టు సర్కిళ్ళలో హాట్ టాపిక్ గా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments