Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

ఠాగూర్
మంగళవారం, 26 నవంబరు 2024 (08:54 IST)
వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ అరెస్టుకు ఏపీ పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న వర్మ పారిపోయారు. ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మొబైల్ ఫోన్ స్విచాఫ్ చేశారు. పోలీసులు అరెస్టు చేశాక.. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారన్న భయంతో ఆయన వణికిపోతున్నారు. 
 
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లపై అసభ్యకర పోస్టులు, ఫోటోల మార్ఫింగ్ చేసినందుకు ఆయనపై కేసులు నమోదైవున్న విషయం తెల్సిందే. ఈ కేసుల్లో విచారణకు రావాలంటూ వర్మకు ఒంగోలు పోలీసులు నోటీసులు జారీచేశారు. ఈ విచారణలో భాగంగా, సోమవారం ఆయన ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్‌కు హాజరుకావాల్సివుంది. 
 
అయితే, విచారణకు డుమ్మా కొట్టారు. దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి వర్మను అరెస్టు చేసేందుకు హైదరాబాద్ నగరంలోని ఫిల్మ్‌ నగరులో ఉన్న ఆయన నివాసానికి వెళ్లారు. అయితే, అప్పటికే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా వర్మ తరపు న్యాయవాది పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 
 
ఆర్జీవీ ఇంట్లో లేరని చెప్పారు. రెండోసారి నోటీసులు ఇచ్చినప్పుడే విచారణకు మరింత సమయం కావాలని తాము కోరామని, అయినప్పటికీ ఆరెస్టు చేసేందుకు ఎందుకు వచ్చారని నిలదీశారు. వర్చువల్‌గా విచా రించేందుకు అవకాశం ఉందని, ఆ మాధ్యమంలో ప్రశ్నిస్తే సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 
 
కాగా, ఇదే విషయాన్ని వర్మ కూడా వాట్సాప్ ద్వారా పోలీసులకు తెలిపారు. వర్చువల్ విచారణకు అనుమతి ఇవ్వాలని విచారణాధికారిని కోరారు. దీనిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంతలో పోలీసులకు మరో సమాచారం అందింది. వర్మ తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్నట్టు తెలిసింది. ఆదివారం తన 'ఎక్స్' ఖాతాలో తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్నట్టు వర్మ ఫొటోలు పోస్టు చేయడం దీనికి బలాన్నిచ్చింది. దీంతో ఆ దిశగా పోలీసులు దృష్టిసారించి, తమిళనాడు పోలీసులతో మాట్లాడారు. ఈ క్రమంలో మరో పోలీసు బృందాన్ని చెన్నైకి పంపేందుకు సిద్ధమవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

ప్రివ్యూ చూస్తూ బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments