తెలుగు రాష్ట్రాలకు తప్పని వాన గండం, మరో మూడురోజుల పాటు వర్ష సూచన

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (19:58 IST)
తెలుగు రాష్ట్రాలకు వాన గండం తప్పేలా లేదు. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలలో వర్షాలు తీవ్ర స్థాయిలో కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉదృతంగా ప్రవహిస్తున్నది. మూడో హెచ్చరిక ప్రమాద స్థాయిని దాటి గోదావరి ప్రవహిస్తున్నది. భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలు కూడా బాగా దెబ్బతిన్నాయి.
 
పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చునని హైదరాబాదు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య మధ్యప్రదేశ్, ఉత్తర చత్తీస్ గడ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతుందని దీనికి అనుగుణంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాక అధికారులు పేర్కొన్నారు.
 
వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఈ అల్పపీడనం ప్రయాణించి బలహీనపడే అవకాశముందని, ఆ ప్రభావంతో వర్షాలకు అవకాశముందని అధికారులు తెలిపారు. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో రేపు అల్ప పీడనం ఏర్పడే అవకాశమున్నట్లు తెలుస్తుంది. దీని ప్రభావం వలన తెలుగు రాష్ట్రాలలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments