తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ శుభవార్త... ఏంటది?

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2023 (10:50 IST)
తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. శంషాబాద్ - విజయవాడ - విశాఖపట్టణం, కర్నూలు -విజయవాడ మధ్య సూపర్ ఫాస్ట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ దిశగా కేంద్ర రైల్వేశాఖ కసరత్తులు చేపట్టింది. ఇందులోభాగంగా, ఈ రెండు మార్గాల్లో ప్రాథమిక ఇంజనీరింగ్ మరియు ట్రాక్ (పెట్) సర్వేకు ఆదేశించింది. సర్వే అనంతరం రైల్వే ప్రాజెక్టులపై తుది నిర్ణయం తీసుకుంటారు. 
 
శంషాబాద్ - విజయవాడ ప్రాంతాల మధ్య రైలు అందుబాటులోకి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం మరింత తగ్గుతుందని, కేంద్ర పర్యాటక శాఖామంత్రి కిషన్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు వివరించారు. దీంతో కేంద్ర రైల్వే శాఖ ఈ మార్గంలో పెట్ సర్వేకు అనుమతులు మంజూరు చేసింది. 
 
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లు గంటకు 110 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తున్నాయి. అయితే, ఇపుడు ప్రతిపాదించిన రెండు సూపర్ ఫాస్ట్ రైలు మార్గాలు మాత్రం అందుబాటులోకి వస్తే ఈ మార్గాల్లో ఏకంగా 220 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడపాలని కేంద్ర రైల్వే శాఖ భావిస్తుంది. 
 
ఈ క్రమంలోనేనే రూట్‌ను నిర్ణయించేందుకు పెట్ సర్వే కోసం ఓ కాంట్రాక్టర్‌ను కూడా ఎంపిక చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో వందే భారత్ రైళ్లను నడిపే విషయాన్ని కూడా భారతీయ రైల్వే సిద్ధమవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్

ఆహ్వానించేందుకు వచ్చినపుడు షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నా : చిరంజీవి

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం